NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Tesla: భారత్‌లోఎంట్రీకి సిద్దమైన టెస్లా.. దిగుమతి సుంకంలో ఉపశమనం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tesla: భారత్‌లోఎంట్రీకి సిద్దమైన టెస్లా.. దిగుమతి సుంకంలో ఉపశమనం 
    భారత్‌లోఎంట్రీకి సిద్దమైన టెస్లా.. దిగుమతి సుంకంలో ఉపశమనం

    Tesla: భారత్‌లోఎంట్రీకి సిద్దమైన టెస్లా.. దిగుమతి సుంకంలో ఉపశమనం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2025
    12:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రభుత్వం మార్చి 2024లో కొత్త ఈవీ విధానాన్ని ప్రకటించింది,అయితే త్వరలో దానిలో మార్పులు జరిగే అవకాశం ఉంది.

    దీని కారణంగా టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీలు త్వరగా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు మార్గం సుగమం కానుంది.

    ప్రస్తుత విధానం ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే విదేశీ కంపెనీలు మూడు సంవత్సరాల్లో కనీసం రూ.4,150 కోట్ల పెట్టుబడి పెట్టాలి.

    దీనితో పాటు, ఇంపోర్ట్ కస్టమ్ సుంకం ప్రస్తుత 110% నుండి 15% వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.

    ఈ తగ్గింపు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతి పొందిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది.

    వివరాలు 

    ఈ విధానం ఎప్పుడు అమలులోకి వస్తుంది? 

    ప్రస్తుతం ఆటో మొబైల్ కంపెనీల నుంచి తక్కువ స్పందన రావడంతో, ఈ విధానంలో మార్పులపై మళ్లీ చర్చ ప్రారంభమైంది.

    ఈవీ ప్లాంట్ కోసం ఇప్పటికే చేసిన పెట్టుబడులను కూడా పాలసీలో చేర్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

    ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ప్రకారం, SMEC (ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీ ప్రోత్సాహక పథకం) మార్గదర్శకాలు రెండు వారాల్లో పూర్తవుతాయని.. వచ్చే నెలలో విడుదల అవుతాయని చెప్పారు.

    వివరాలు 

    ఛార్జింగ్ స్టేషన్ల పెట్టుబడిపై తగ్గింపు 

    ఈ పాలసీ ప్రకారం, కంపెనీలు మూడు సంవత్సరాలలోపు తమ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి.

    అలాగే, ఐదు సంవత్సరాలలోపు 50% స్థానిక ఉత్పత్తిని అనుసరించాలి. తయారీ ప్లాంట్లతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల పెట్టుబడులకు కూడా ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని పరిశీలిస్తోంది.

    దీనివల్ల ఛార్జింగ్ స్టేషన్లపై పెట్టిన పెట్టుబడులు కూడా మొత్తం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి నిబంధనలో భాగంగా పరిగణించబడతాయి.

    వివరాలు 

    రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ సాయం 

    బడ్జెట్‌లో ప్రకటించిన రూ.10,000 కోట్ల ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నిధిని ఛార్జింగ్ స్టేషన్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగిస్తారు.

    అదనంగా, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వడ్డీ లేకుండా రూ.1.5 లక్షల కోట్ల రుణాన్ని పొందే అవకాశం ఉంది.

    మొత్తంగా, ఈ మార్పులు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధికి మద్దతుగా పనిచేస్తాయని అంచనా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెస్లా

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    టెస్లా

    Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం భారతదేశం
    రూ.6వేల కోట్ల జీతాలను వాపస్ చేయనున్న టెస్లా డైరెక్టర్లు ఎలాన్ మస్క్
    టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన ఈవీ వెహికల్.. ఇండియాలోనే మాన్యూఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ!  ఆటో మొబైల్
    కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో టెస్లా ఉన్నతాధికారుల కీలక చర్చలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025