NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Train Facts: రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకుంచుతారో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Train Facts: రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకుంచుతారో తెలుసా?
    రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకుంచుతారో తెలుసా?

    Train Facts: రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకుంచుతారో తెలుసా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 04, 2024
    05:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్రాఫిక్‌లో రెండు నిమిషాల కంటే ఎక్కువ వేచి ఉంటే, ఇంధనాన్ని ఆదా చేయడానికీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికీ బైకులు, బస్సులు, ఆటోలు వంటి వాహనాలు ఇంజన్ ఆఫ్ చేస్తాం.

    అయితే, రైళ్ల విషయానికి వస్తే ఇది పూర్తి భిన్నం. డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ట్రైన్‌లు స్టేషన్‌లో ఎక్కువసేపు ఆగినప్పటికీ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది.

    దీనికి కారణాలు ఏమిటి? లోకోపైలెట్లు ఇంజన్ ఆఫ్ చేయకుండా ఎందుకు ఉంచుతారు? దీని వెనుక ఉన్న అసలు విషయాలు, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుందాం.

    వివరాలు 

    ఇంధన ఖర్చు

    స్టేషన్‌లో ఎంతసేపు ఆగినా,డీజిల్ ఇంజన్‌ను ఆన్‌లో ఉంచడానికే ప్రాధాన్యత ఇస్తారు.ఎందుకంటే, ఇంజన్‌ను ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేయడం చాలా సమయాన్ని తీసుకుంటుంది.

    అలాగే ఫ్యూయల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది.ఇంజన్ వేడెక్కేందుకు కూడా సుమారు అరగంట సమయం పడుతుంది.

    ఇంజన్‌ను ఆన్‌లో ఉంచడం వల్ల సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతాయి,తద్వారా ట్రైన్ సమయానికి స్టేషన్ నుండి బయలుదేరుతుంది.

    ఎలక్ట్రిక్ ట్రైన్‌ల విషయంలో:

    ఎలక్ట్రిక్ ట్రైన్లకూ ఇదే పద్ధతిని అనుసరిస్తారు.సిగ్నల్ వచ్చిందంటే ఇంజన్ వెంటనే సిద్ధంగా ఉండాలి.ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల తిరిగి ఆన్ చేసి రైలు మొదలవడానికి సమయాన్ని వృథా చేస్తుంది. ఇంజన్‌ తరచుగా ఆఫ్-ఆన్ చేయడం వల్ల టెక్నికల్ సమస్యలు కూడా ఏర్పడతాయి, ఇంజన్ పనితీరు ప్రభావితమవుతుంది.

    వివరాలు 

    మరొక ముఖ్య కారణం ఏంటంటే..

    ఇంజన్‌ను ఆన్‌లో ఉంచడానికి మరో ముఖ్య కారణం ఎయిర్ సిస్టం. బ్రేక్‌లను ఛార్జ్ చేయడానికి ఎయిర్ సిస్టం ఇంజన్‌తో ముడిపడి ఉంటుంది.

    ఇంజన్ ఆఫ్ చేస్తే, ఎయిర్ ప్రెజర్ తగ్గిపోతుంది. బ్రేక్ ఫెయిల్యూర్ ప్రమాదం పెరుగుతుంది. ఇంజన్ మళ్లీ ఆన్ చేయగానే, ఎయిర్ సిస్టం పనిచేయడం ప్రారంభమవుతుంది, కానీ బ్రేక్‌లను పూర్తిగా రీఛార్జ్ చేయడానికి అరగంట నుంచి గంట సమయం పడుతుంది.

    ఈ సమయంలో ప్రయాణికులు నిరీక్షించవలసి వస్తుంది.

    వివరాలు 

    నిరంతర సమర్థత

    ఇంజన్‌ను ఆన్‌లో ఉంచడం వల్ల సమయాన్ని ఆదా చేయడంతో పాటు, బ్రేక్ సిస్టం నిరంతరం ఛార్జింగ్‌లో ఉండి ప్రమాదాలను నివారిస్తుంది.

    అందుకే, లోకోపైలెట్లు ఇంజన్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచడం మేలని భావిస్తారు, సిగ్నల్ పడగానే ట్రైన్ సజావుగా ప్రయాణం కొనసాగుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే స్టేషన్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025