NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 8th Pay Commission: గుడ్​న్యూస్​- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు
    తదుపరి వార్తా కథనం
    8th Pay Commission: గుడ్​న్యూస్​- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు
    గుడ్​న్యూస్​- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు

    8th Pay Commission: గుడ్​న్యూస్​- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2025
    03:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదారులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్తను అందించింది.

    లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు పెంచే లక్ష్యంతో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

    1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

    జాప్యం లేకుండా వేతన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సంకల్పించారని తెలిపారు.

    వివరాలు 

    త్వరలోనే కొత్త కమిషన్‌కి ఛైర్మన్, ఇద్దరు సభ్యులు

    ఈ క్రమంలోనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

    ప్రస్తుతం ఉన్న 7వ పే కమిషన్ 2016లో ఏర్పాటై, దాని గడువు 2026లో ముగుస్తుందని చెప్పారు.

    అయితే ఆ గడువుకన్నా ముందే, 2025లోనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమయాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

    7వ పే కమిషన్ గడువు ముగిసే ముందు వేతనాల పెంపుపై సిఫారసులు పొందే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.

    త్వరలోనే కొత్త కమిషన్‌కి ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమిస్తామని మంత్రి తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 8వ కేంద్ర వేతన సంఘానికి ప్రధాన మంత్రి ఆమోదం  

    #WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "Prime Minister has approved the 8th Central Pay Commission for all employees of Central Government..." pic.twitter.com/lrVUD25hFu

    — ANI (@ANI) January 16, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025