NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Budget 2024: తన పుట్టినరోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    Budget 2024: తన పుట్టినరోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా? 
    తన పుట్టినరోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా?

    Budget 2024: తన పుట్టినరోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 21, 2024
    08:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనుంది.

    మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

    సాధారణ బడ్జెట్‌ను,మధ్యంతర బడ్జెట్‌ను కలిపి ఆమె ఏడోసారి సమర్పించబోతున్నారు.

    ఇది స్వతహాగా ఒక రికార్డు అయితే ఇప్పటివరకు గరిష్టంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మరొకరి పేరు మీద ఉంది.

    అవును, దేశంలోనే అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది.

    అంతేకాదు తన పుట్టినరోజున రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఆయన సొంతం. ఇప్పుడు,ఆ కథ ఏంటో తెలుసుకుందాం.

    వివరాలు 

    ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి 

    భారతదేశంలో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పార్లమెంట్‌లో కేంద్ర లేదా మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

    ఎన్నికల సంవత్సరాల్లో మధ్యంతర బడ్జెట్, ఇతర సంవత్సరాల్లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు.

    2024 లోక్‌సభ ఎన్నికల కారణంగా, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

    ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బడ్జెట్ సెషన్‌లో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

    ఇది ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, ఖర్చుల పత్రం. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది.

    వివరాలు 

    భారతదేశపు తొలి బడ్జెట్‌ను ఆయన సమర్పించారు 

    నిజానికి, భారతదేశం మొదటి బడ్జెట్‌ను బ్రిటిష్ పాలనలో ఏప్రిల్ 7, 1860న బ్రిటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ సమర్పించారు.

    ఈస్ట్ ఇండియా కంపెనీ ఖర్చుల ఖాతాలను సిద్ధం చేయడానికి, భారతదేశంలో కొత్త పన్నులు విధించడానికి ఇది ప్రవేశపెట్టబడింది.

    స్వతంత్ర భారతదేశం మొదటి మధ్యంతర బడ్జెట్‌ను తాత్కాలిక ప్రభుత్వం కోసం లియాఖత్ అలీ ఖాన్ సమర్పించారు.

    తరువాత అయన పాకిస్తాన్ ప్రధాన మంత్రి అయ్యాడు. స్వతంత్ర భారతదేశం మొదటి సాధారణ బడ్జెట్‌ను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసిన ఆర్‌కె షణ్ముఖం చెట్టి సమర్పించారు. ఈ బడ్జెట్ 1947 నవంబర్ 16న సమర్పించబడింది.

    వివరాలు 

    మొరార్జీ దేశాయ్ 10 సార్లు పార్లమెంటులో ఆదాయ వ్యయాల లెక్కలను సమర్పించారు 

    అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది.

    మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్‌లోని వల్సాద్‌లో జన్మించారు.

    1958 మార్చి 13న దేశ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అయన 29 ఆగస్టు 1963 వరకు ఈ పదవిలో కొనసాగారు.

    దీని తరువాత, మార్చి 1967 లో, అయనకి మరోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించబడ్డాయి.

    ఈసారి జూలై 1969 వరకు ఆర్థిక మంత్రిగా కొనసాగారు. ఈ పదవీకాలంలో ఆయన మొత్తం 10 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు.

    వివరాలు 

    రెండు పర్యాయాలు బడ్జెట్ తేదీ ఆర్థిక మంత్రి పుట్టినరోజు

    ఈ మధ్య కాలంలో బడ్జెట్ రోజు ఆర్థిక మంత్రి జ న్మ దినం కావ డంతో ఇలాంటి సంద ర్భాలు రెండు వ చ్చాయి.

    ఫిబ్రవరి 29న జన్మించిన మొరార్జీ దేశాయ్ పుట్టినరోజు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది.

    అప్పుడు బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి తేదీన సమర్పించారు. ఇటీవల ఈ ట్రెండ్ ముగిసింది.

    ఈ 29వ తేదీన 1964, 1968 సంవత్సరాల్లో మొరార్జీ దేశాయ్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

    వివరాలు 

    సాధారణ బడ్జెట్‌ను కూడా ఆయన పలుమార్లు ప్రవేశపెట్టారు 

    దీని తరువాత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను సమర్పించిన రికార్డును కలిగి ఉన్నారు.

    ఆర్థిక మంత్రిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఎనిమిదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

    ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

    వివరాలు 

    ప్రధానిగా చేసిన మొరార్జీ దేశాయ్  

    వల్సాద్‌లోని ఒక గ్రామంలో జన్మించిన మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా కూడా చేశారు.

    1977లో తొలిసారిగా దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

    అప్పుడు అయన వయస్సు 81 సంవత్సరాలు. మొరార్జీ దేశాయ్ 24 మార్చి 1977న ప్రధానమంత్రి అయ్యారు.. 28 జూలై 1979 వరకు ఈ పదవిలో కొనసాగారు.

    భారతదేశం అత్యున్నత గౌరవం భారతరత్నతో పాటు, అయన పాకిస్తాన్ అత్యున్నత గౌరవం నిషాన్-ఎ-పాకిస్తాన్ అందుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్ 2024

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బడ్జెట్ 2024

    Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు  మధ్యంతర బడ్జెట్ 2024
    Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్  నిర్మలా సీతారామన్
    Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్  పన్ను
    New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం  నిర్మలా సీతారామన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025