LOADING...
Anil Ambani: అనిల్ అంబానీపై రూ.2,929 కోట్ల రుణ మోసం కేసు.. సీబీఐ కేసు నమోదు
అనిల్ అంబానీపై రూ.2,929 కోట్ల రుణ మోసం కేసు.. సీబీఐ కేసు నమోదు

Anil Ambani: అనిల్ అంబానీపై రూ.2,929 కోట్ల రుణ మోసం కేసు.. సీబీఐ కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి మరో పెద్ద షాక్‌ ఎదురైంది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు నమోదు చేసింది. రూ.2,929.05 కోట్ల రుణ మోసం కేసులో (Bank Fraud Case) అనిల్‌ అంబానీపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ చర్యలు చేపట్టింది. ముంబైలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్)‌, దాని డైరెక్టర్‌ అనిల్‌ అంబానీ, ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. గతంలోనే మనీ లాండరింగ్‌ ఆరోపణలతో సంబంధం ఉన్న రూ.2,000 కోట్ల మోసపూరిత ఎస్బీఐ రుణం కేసులో కూడా అనిల్‌ అంబానీకి చెందిన సంస్థలపై సీబీఐ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

వివరాలు 

ఫ్రాడ్‌గా గుర్తించిన ఎస్బీఐ 

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే అనిల్‌ అంబానీని ఫ్రాడ్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్,దాని అనుబంధ సంస్థలు ఎస్బీఐ సహా వివిధ బ్యాంకుల నుండి మొత్తం రూ.31,580 కోట్ల రుణాన్ని పొందినట్టు తాజా ఫైలింగ్‌లు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ నిధులను సరైన విధంగా వినియోగించకపోయారని, వాటిని దుర్వినియోగం చేసినట్టు SBI స్పష్టం చేసింది. ఆర్‌కామ్‌ నడిపిన విధానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్న బ్యాంక్, దీనిని మోసపూరిత రుణంగా వర్గీకరించాలన్నది ఫ్రాడ్‌ ఐడెంటిఫికేషన్‌ కమిటీ తీర్మానించినట్టు తేల్చిచెప్పింది.

వివరాలు 

ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటిస్తే.. 21 రోజుల్లోగా ఆ వివరాలను ఆర్బీఐకి నివేదించాలి 

SBI లేఖ ప్రకారం,ఇచ్చిన రుణంలో రూ.13,667.73 కోట్లను రుణ చెల్లింపులు,ఇతర అవసరాల కోసం ఉపయోగించాలని,అలాగే రూ.12,692.31 కోట్లను సంబంధిత పార్టీల చెల్లింపులకు వినియోగించాలని ఉన్న నిబంధనలు ఉన్నాయి. కానీ 2016లో రుణ చెల్లింపులకు కేవలం రూ.6,265.85 కోట్లను,సంబంధిత పార్టీలకు కేవలం రూ.5,501.56 కోట్లను మాత్రమే అందించినట్టు SBI పేర్కొంది. అదేవిధంగా,బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.250 కోట్ల రుణం,ఐఐఎఫ్‌సీఎల్ నుంచి పొందిన రూ.248 కోట్ల రుణాలకు కూడా ఇదే రకమైన అవకతవకలు ఉన్నట్లు వెల్లడైంది. రీసర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మార్గదర్శకాలు ప్రకారం,ఏదైనా ఖాతాను మోసంగా గుర్తిస్తే, 21 రోజుల్లో ఆ వివరాలను RBIకి నివేదించాలి. అంతేకాక, పోలీసులు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి కూడా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.