NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Centre to Slash Fuel Rates: వాహనదారులకు అలెర్ట్..త్వరలోనే తగనున్న ఇంధన ధరలు..కేంద్రం కీలక ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    Centre to Slash Fuel Rates: వాహనదారులకు అలెర్ట్..త్వరలోనే తగనున్న ఇంధన ధరలు..కేంద్రం కీలక ప్రకటన 
    త్వరలోనే తగనున్న ఇంధన ధరలు

    Centre to Slash Fuel Rates: వాహనదారులకు అలెర్ట్..త్వరలోనే తగనున్న ఇంధన ధరలు..కేంద్రం కీలక ప్రకటన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    02:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని వాహనదారులకు త్వరలో శుభవార్త అందనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

    కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం పేర్కొంటోంది.

    ఈ వార్త గురువారం నాడు పలు ఆంగ్ల టెలివిజన్ ఛానెళ్ల ద్వారా వెలువడింది. అయితే, ఇప్పటి వరకు ధరల తగ్గింపుపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గించింది, ఇది దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది.

    వివరాలు 

    అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన చమురు ధరలు 

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోయాయి.

    ఈ సందర్భంలో దేశీయ ఆయిల్ కంపెనీలు తమ ధరలను పెంచలేకపోయాయి, కానీ అంతర్జాతీయ ధరలు తగ్గినప్పటికీ, స్థిరంగానే ఉంచుతూ వస్తున్నాయి.

    ఈ కారణంగా, ఆయిల్ కంపెనీలు భారీగా లాభాలు సాధించాయి.

    ఇటీవలి కాలంలో, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ తగ్గుతున్నాయి.

    లిబియాలో చమురు ఉత్పత్తి, ఎగుమతి సమస్యలు పరిష్కారం కావడం, చైనాలో డిమాండ్ తగ్గడం వంటి అంశాలు ఇందుకు దారితీసాయి.

    ఈ పరిణామాల ఫలితంగా, బ్రెంట్ క్రూడాయిల్ ధర కూడా జనవరి తర్వాత కనిష్ట స్థాయికి చేరింది, ప్రస్తుతం ఇది బ్యారెల్‌కు 72 డాలర్ల వద్ద ఉంది.

    వివరాలు 

    అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం 

    ఈ పరిణామాల నేపథ్యంలో, భారతదేశంలో మహారాష్ట్ర, హరియాణా వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కేంద్ర ప్రభుత్వం

    ఫార్మా కంపెనీలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించిన కేంద్రం  తాజా వార్తలు
    Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రసాదం అంటూ Amazonలో అమ్మకం.. కేంద్రం నోటీసులు  అమెజాన్‌
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' బిహార్
    Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు  పేటియం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025