NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్  
    తదుపరి వార్తా కథనం
    80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్  
    80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్

    80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 28, 2023
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ షేర్లు హాంకాంగ్‌ స్టాక్‌మార్కెట్లో సోమవారం ఉదయం భారీగా పతనం అయ్యాయి.

    ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న ఎవర్‌గ్రాండ్‌.. ఆదివారం మరో 4.5 బిలియన్‌ డాలర్లు (రూ.37 వేల కోట్ల) నష్టాన్ని ప్రకటించింది.

    ఈ సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో అంతకముందుతో పోలిస్తే నష్టాలు 50 శాతం తగ్గినట్లు వెల్లడించింది.

    నగదు పెంచడానికి కంపెనీ డైరెక్టర్లు పలు చర్యలు తీసుకోడంతో ఆదాయం 44 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

    అదే సమయంలో నగదు నిల్వలు 6.3శాతానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు భయపడ్డారు.

    అదే సమయంలో దీని ఎలక్ట్రానిక్‌ వాహన విభాగం కూడా నష్టాలను ప్రకటించింది.ఈ కంపెనీ షేర్లు హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్లో సోమవారం 80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

    Details 

    17 నెలల తర్వాత  ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌

    అంతకముందు మూడేళ్లతో పోల్చుకొంటే తాజాగా ఆ కంపెనీ షేరు విలువలో 99 శాతం కోల్పోయినట్లైంది.

    అంతకముందు సంవత్సరం మార్చి నుంచి ఈ కంపెనీ షేర్లను ట్రేడింగ్‌ నుండి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే కంపెనీ షేర్ల ట్రేడింగ్‌కు అనుమతిలభించడంతో 17 నెలల తర్వాత సోమవారం తిరిగి ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.

    గత మార్చిలో దీని విలువ 1.65 హాంకాంగ్‌ డాలర్లుగా ఉండేది. నేడు ట్రేడింగ్‌ను 0.22 డాలర్ల వద్ద మొదలుపెట్టింది.

    ఆ తర్వాత కొంచెం కోలుకొంది.నిజానికి చైనా,హాంకాంగ్‌ మార్కెట్లలో షేర్ల ట్రేడింగ్‌పై 0.1 శాతం పన్ను తగ్గించారు.

    ఇన్వెస్టర్లను ఎంకరేజ్ చెయ్యడానికే ఈ రకంగా చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

    ఈ చర్యతో చైనా, హాంకాంగ్‌ సూచీలు నేడు మంచి లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    చైనా

    చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం కోవిడ్
    బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం  భారతదేశం
    షెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా  అంతరిక్షం
    సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025