Page Loader
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 37 పాయింట్లతో లాభపడిన నిఫ్టీ 
ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 37 పాయింట్లతో లాభపడిన నిఫ్టీ

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 37 పాయింట్లతో లాభపడిన నిఫ్టీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్థిరంగా (ఫ్లాట్‌గా) ముగిశాయి. అమెరికాలో నెలకొన్న మాంద్యం భయాలతో నిన్న ఆ దేశ స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా క్షీణించాయి. దీని ప్రభావం నేడు ఆసియా స్టాక్‌ మార్కెట్లపై కూడా కనిపించింది. దేశీయ మార్కెట్లపైనా ఆ ప్రభావం తొలుత స్పష్టంగా కనిపించినప్పటికీ, తర్వాత సూచీలు స్థిరంగా కోలుకున్నాయి. చివరికి సూచీలు తేలికపాటి మార్పులతో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్ల విక్రయాలు సూచీలను నెగేటివ్‌గా ప్రభావితం చేయగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ షేర్లు మార్కెట్‌ను నిలబెట్టాయి.

వివరాలు 

సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీల పరిస్థితి 

బీఎస్ఈ సెన్సెక్స్‌ ఉదయం 73,743.88 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 74,115.17) నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం మొత్తం నష్టాల్లోనే కొనసాగినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత స్వల్ప లాభాలను కనబరిచింది. సూచీ 74,195.17 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత చివరికి 12.85 పాయింట్ల నష్టంతో 74,102.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 37.60 పాయింట్ల నష్టంతో 22,497.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు కోలుకుని 87.22 వద్ద ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, జొమాటో షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి.

వివరాలు 

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్ల క్షీణత 

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 69 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 2916 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రైవేటు రంగ బ్యాంక్‌ ఇండస్‌ ఇండ్‌ షేర్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 27 శాతం మేర క్షీణించాయి. బ్యాంక్‌కు చెందిన డెరివేటివ్‌ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు ఉన్నట్లు జరిగిన అంతర్గత సమీక్షలో వెల్లడైంది. దీని కారణంగా బ్యాంక్‌ నికర విలువపై దాదాపు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేసింది, ఇది సుమారు రూ.1,500 కోట్ల నష్టానికి సమానం.

వివరాలు 

రూ.655.95కి పడిపోయిన  ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్ 

ఈ ప్రకటన షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ప్రస్తుతం ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ సీఈఓగా ఉన్న సుమంత్‌ కత్పలియా పదవీకాలాన్ని మూడు సంవత్సరాలకు కాకుండా కేవలం ఒక సంవత్సరమే పొడిగించేందుకు ఆర్‌బీఐ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం సోమవారం బీఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్లు 3.86 శాతం నష్టపోయి రూ.900.70 వద్ద ముగిశాయి. తాజా ప్రకటనతో మంగళవారం మరింత క్షీణించి 27 శాతం నష్టంతో రూ.655.95కి పడిపోయాయి.