NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Mansukh Mandaviya: పదేళ్లలో ఉపాధి శాతం పెరిగింది..దశాబ్దకాలంలో ఎన్డీయే ప్రభుత్వం 17.19 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్‌ మాండవీయ
    తదుపరి వార్తా కథనం
    Mansukh Mandaviya: పదేళ్లలో ఉపాధి శాతం పెరిగింది..దశాబ్దకాలంలో ఎన్డీయే ప్రభుత్వం 17.19 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్‌ మాండవీయ
    దశాబ్దకాలంలో ఎన్డీయే ప్రభుత్వం 17.19 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్‌ మాండవీయ

    Mansukh Mandaviya: పదేళ్లలో ఉపాధి శాతం పెరిగింది..దశాబ్దకాలంలో ఎన్డీయే ప్రభుత్వం 17.19 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్‌ మాండవీయ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2025
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఉపాధి శాతం గణనీయంగా పెరిగిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

    యూపీఏ హయాం కాలంతో పోల్చితే ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో ఐదు రెట్లు ఎక్కువ ఉద్యోగాలను కల్పించిందని తెలిపారు.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)గణాంకాలను ఉటంకిస్తూ ఉపాధి కల్పనకు సంబంధించిన గణాంకాలను వివరించారు.

    2014-15లో 47.15కోట్ల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ, 2023-24 నాటికి 36 శాతం పెరుగుదలతో 64.33 కోట్లకు చేరిందని తెలిపారు.

    2004-2014 మధ్యకాలంలో ఉపాధి కల్పన కేవలం 7 శాతం మాత్రమే పెరిగిందని,ఆ కాలంలో యూపీఏ ప్రభుత్వం 2.9కోట్ల ఉద్యోగాలను సృష్టించగా,గత పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం మొత్తం 17.19 కోట్ల ఉద్యోగాలను కల్పించిందని వెల్లడించారు.

    వివరాలు 

    3.2 శాతానికి తగ్గిన నిరుద్యోగిత రేటు

    అంతేకాకుండా,2023-24ఆర్థిక సంవత్సరంలో ఒక్కదానిలోనే 4.6కోట్ల మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు.

    వ్యవసాయ రంగం విషయానికి వస్తే,యూపీఏ హయాంలో ఉపాధి కల్పనలో 16శాతం క్షీణత కనిపించగా,2014-2023 మధ్యకాలంలో ఇది 19శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు.

    అలాగే తయారీ రంగంలో 2014-2023 మధ్య 15శాతం వృద్ధి చెందగా,యూపీఏ హయాంలో ఇది కేవలం 6 శాతం మాత్రమే ఉన్నదని వివరించారు.

    సేవా రంగంలో 2004-2014 మధ్య 25శాతం వృద్ధి కనిపించగా,2014-2023 నాటికి ఇది 36శాతానికి చేరిందని తెలిపారు.

    నిరుద్యోగిత రేటు 2017-18మధ్య 6శాతంగా ఉండగా,2023-24 నాటికి ఇది 3.2 శాతానికి తగ్గిందని చెప్పారు.

    ఉద్యోగ కల్పన రేటు 46.8శాతం నుంచి 58.2శాతానికి పెరిగిందని,కార్మిక శక్తి భాగస్వామ్య రేటు(LFPR) 49.8శాతం నుంచి 60.1శాతానికి పెరిగిందని మన్‌సుఖ్ మాండవీయ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మన్‌సుఖ్ మాండవీయ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    మన్‌సుఖ్ మాండవీయ

    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ కోవిడ్
    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కరోనా కొత్త మార్గదర్శకాలు
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025