NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు 
    లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

    Stock Market : లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2025
    09:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, దేశీయ సూచీలు మంచి ప్రదర్శన చూపిస్తున్నాయి.

    విదేశీ మదుపర్లు మెల్లగా పెట్టుబడిదారులుగా మారుతుండటంతో మార్కెట్‌కు బలపడిన సూచనలు కనిపిస్తున్నాయి.

    రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్ వంటి ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

    దీనివల్ల, మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్‌ 180 పాయింట్ల లాభంతో మొదలవగా, నిఫ్టీ 24,350 పాయింట్లకు పైగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.

    వివరాలు 

    నష్టాల్లో నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు

    ఉదయం 9:25 గంటల సమయానికి సెన్సెక్స్‌ 428 పాయింట్ల లాభంతో 80,646 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 123 పాయింట్ల లాభంతో 24,452 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం), ఎటర్నల్‌, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్‌, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.

    అదే సమయంలో సన్‌ ఫార్మా, ఏషియన్ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, బజాజ్ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ ధర 65.48 డాలర్లు 

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

    ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.86 శాతం లాభపడగా, జపాన్‌లో నిక్కీ 0.38 శాతం వృద్ధితో ట్రేడవుతోంది. అయితే, చైనాలోని షాంఘై మార్కెట్ 0.06 శాతం నష్టపోయింది.

    అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ ధర 65.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    బంగారం ధర ఔన్సుకు 3,325.70 డాలర్ల వద్ద ఉంది. గత ట్రేడింగ్ సెషన్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నికరంగా రూ.2,474 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) అయితే నికరంగా రూ.2,818 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    స్టాక్ మార్కెట్

    Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన ప్రపంచ  మార్కెట్లను కుదిపేసింది.. గోల్డ్‌ కొత్త రికార్డ్‌  బిజినెస్
    Stock Market: డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు  బిజినెస్
    Stock market: టారిఫ్‌ల ప్రభావం అంతంతే.. మోస్తరు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..  బిజినెస్
    Stock Market :భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు..  సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025