NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / India-Pak: ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India-Pak: ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన!
    ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన!

    India-Pak: ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన!

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, దేశంలోని ప్రజల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుంటూ భారత ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రారంభించింది.

    దేశంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తినా, కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల కొరత ఉండబోదని, తగినంత నిల్వలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

    పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి ప్రధాన ఆహార వస్తువుల ధరలు నియంత్రణలోనే ఉండేలా సమగ్రమైన పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

    దేశంలోని అన్ని నగరాల్లో సరఫరా సజావుగా కొనసాగేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

    దీంతో ప్రజలు అవసరమైన వస్తువుల విషయమై ఎలాంటి ఆందోళనకు లోనవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

    వివరాలు 

    వ్యాపారులు,సరఫరాదారులపై నిఘా 

    ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆహార శాఖ కార్యదర్శులతో పాటు ఇతర ముఖ్యమైన రంగాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తోంది.

    నిత్యావసర వస్తువుల ధరలను పెంచడాన్ని నియంత్రించడంతోపాటు, దాచివేతలు జరగకుండా చూడడంలో భాగంగా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపినట్లు అధికారులు తెలిపారు.

    వ్యాపారులు,సరఫరాదారులపై నిఘా ఉంచాలని కూడా సూచించారు.

    వివరాలు 

    నిత్యావసర సరకుల నిల్వపై చండీగఢ్‌లో నిషేధం 

    భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలపై మరింత శ్రద్ధ వహిస్తోంది.

    ఈ పరిణామాల్లో భాగంగా చండీగఢ్‌లో నిత్యావసర వస్తువుల నిల్వలపై నిషేధం విధించారు.

    స్థానిక అధికారులు అన్ని వ్యాపారులకు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను మూడు రోజులలోపు ఆహార, సరఫరాల శాఖకు ఇవ్వాలని ఆదేశించారు.

    దేశంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని లాభదాయకంగా మలచుకునే ప్రయత్నంగా, కొన్ని సంస్థలు, వ్యాపారులు పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసరాల్ని అక్రమంగా నిల్వ చేస్తుండటంపై సమాచారం రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

    వివరాలు 

    పంజాబ్‌ సరిహద్దుల్లో హెచ్చరికలు - ప్రజల్లో ఆందోళన 

    భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకార చర్యగా పాకిస్థాన్‌ సరిహద్దు రాష్ట్రాలపై దాడులు ప్రారంభించిందని సమాచారం.

    ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని చండీగఢ్‌లో శుక్రవారం ఉదయం నుంచి ఎయిర్ సైరన్లు మోగడం ప్రారంభమైంది.

    ఈ పరిణామం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించింది. పాకిస్థాన్‌ వైపు నుంచి విమానదాడులు జరగవచ్చన్న అనుమానంతో, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది.

    ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు కూడా రావొద్దని స్పష్టంగా హెచ్చరించింది.

    ఇదే తరహా హెచ్చరికలు పంచకుల, మొహాలీ, పటియాలా, అంబాలా ప్రాంతాల్లోనూ జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    India-Pak: ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన! కేంద్ర ప్రభుత్వం
    Chiru-Anil: చిరు-అనిల్‌ రావిపూడి మూవీ.. షూటింగ్‌కు ముహూర్తం ఖరారు! చిరంజీవి
    Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం! స్టాక్ మార్కెట్
    khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు పాకిస్థాన్

    కేంద్ర ప్రభుత్వం

    IAF: భారత వాయుసేనకు తేజస్‌ కష్టాలకు చెక్‌ .. హైలెవల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం భారతదేశం
    Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బిజినెస్
    Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఆరేళ్ల నిషేధం చాలు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ సుప్రీంకోర్టు
    Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025