Page Loader
Eternal shares: త్రైమాసిక ఫలితాల అనంతరం చరిత్ర సృష్టించిన ఎటెర్నల్‌
త్రైమాసిక ఫలితాల అనంతరం చరిత్ర సృష్టించిన ఎటెర్నల్‌

Eternal shares: త్రైమాసిక ఫలితాల అనంతరం చరిత్ర సృష్టించిన ఎటెర్నల్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

జొమాటో, బ్లింకిట్ వంటి వ్యాపార బ్రాండ్‌లను నిర్వహిస్తున్న ఎటెర్నల్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో చరిత్ర సృష్టించాయి. త్రైమాసిక ఫలితాల వెలువడిన తర్వాత, ఈ కంపెనీ షేర్‌ ధర రూ.311 వరకు పెరిగి ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకింది. దీని ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3 లక్షల కోట్లకు పైగా చేరింది. ఈ మైలురాయితో నిఫ్టీ-50లోని విప్రో, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నెస్లే ఇండియా లాంటి దిగ్గజాలను కూడా ఎటెర్నల్‌ అధిగమించింది. ఒకవైపు లాభాల్లో 90 శాతం భారీ తగ్గుదల నమోదవుతున్నా.. మరొకవైపు ఆదాయంలో 70 శాతం జంప్ నమోదు కావడం విశేషం. గతేడాది రూ.4,206 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి రూ.7,167 కోట్లకు పెరిగింది.

Details

 తొలిసారి బ్లింకిట్ నెట్ ఆర్డర్ ను వాల్యూను అధిగమించిన జొమాటో

ఈ వృద్ధికి ప్రధానంగా బ్లింకిట్ విభాగంలో వచ్చిన ప్రగతి కారణం. తొలిసారి జొమాటో నెట్‌ ఆర్డర్‌ వాల్యూను బ్లింకిట్ అధిగమించడం ఇదే మొదటిసారి. గ్రాస్‌ ఆర్డర్ వాల్యూలో 140 శాతం వృద్ధి నమోదు చేయడం, బ్లింకిట్‌ వృద్ధి బలంగా కొనసాగుతుండటం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. త్రైమాసిక ఫలితాల అనంతరం బ్రోకరేజీ సంస్థలు ఎటెర్నల్‌పై ధీమాగా ఉన్నట్లు చూపిస్తూ 'బై' రేటింగులు అందించాయి. నొమురా తన టార్గెట్‌ ప్రైస్‌ను రూ.280 నుంచి రూ.300కి పెంచగా, నువామా ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రూ.290 నుంచి రూ.320కి టార్గెట్‌ మార్చింది.

Details

తారస్థాయికి పోటీ

ఇదే సమయంలో జెఫ్రీస్‌ సంస్థ నేరుగా రూ.250 నుంచి రూ.400కి టార్గెట్‌ ప్రైస్ పెంచడం గమనార్హం. గత 12 నెలల్లో ఎటెర్నల్‌ షేరు ధర 33 శాతం పెరిగినదే కాక, ఈ ఏడాది 2025లో ఇప్పటివరకు 7 శాతం మేర వృద్ధి సాధించింది. ఎటెర్నల్‌ ప్రభావంతో స్విగ్గీ షేర్లకు కూడా ఊతమిచ్చింది. ప్రస్తుతం స్విగ్గీ షేర్లు సుమారు 5 శాతం లాభంతో రూ.412 వద్ద ట్రేడవుతున్నాయి. ఫుడ్‌ డెలివరీ, క్విక్‌ కామర్స్ విభాగాల్లో పోటీ తారాస్థాయికి చేరినట్టే కన్పిస్తోంది.