NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Fact check : ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Fact check : ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?
    ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?

    Fact check : ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    02:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజూ అనేక ఫేక్ న్యూస్‌లు వైరల్ అవుతుంటాయి.

    వాటిలో నిజమెంతో తెలియకుండానే చాలామంది వాటిని నమ్ముతూ,ఆ వార్తలను మరింతగా షేర్ చేస్తూ ఉంటారు.

    దీనివల్ల ప్రజలు అయోమయంలో పడడం,అపోహలకు లోనవడం జరుగుతోంది.

    ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల జోక్యం అవసరమవుతుంది.

    వారు ముందుకు వచ్చి అసత్య వార్తలను ఖండించి, నిజం ఏంటనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు.

    ఇదే నేపథ్యంలో ఇటీవల రూ.500 నోట్లపై వస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది.

    2026 మార్చి నాటికి రూ.500 నోట్లు మార్కెట్‌లో నిలిపివేస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.

    దీనిపై అధికారికంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఒక ట్వీట్‌ను జారీ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     పీఐబీ ఫ్యాక్ట్ చెక్  చేసిన ట్వీట్ 

    Is the ₹500 note set to be phased out by 2026? 🤔

    A #YouTube video on the YT Channel 'CAPITAL TV' (capitaltvind) falsely claims that the RBI will discontinue the circulation of ₹500 notes by March 2026.#PIBFactCheck

    ✔️@RBI has made NO such announcement.

    ✔️₹500 notes have… pic.twitter.com/NeJdcc72z2

    — PIB Fact Check (@PIBFactCheck) June 3, 2025

    వివరాలు 

     పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ 

    ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లు వచ్చే ఏడాది మార్చి వరకు క్రమంగా నిలిపివేస్తారన్న వార్త పూర్తిగా అసత్యమని పీఐబీ స్పష్టం చేసింది.

    ఓ యూట్యూబ్ ఛానల్ విడుదల చేసిన వీడియోలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ఆర్బీఐ ఈ నోట్లను 2026 మార్చి నాటికి నిలిపేస్తుందని ప్రచారం చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

    ఈ దుష్ప్రచారాన్ని తప్పుపడుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికతో పాటు, ఎక్స్ ప్లాట్‌ఫాంలో ఒక స్పష్టమైన పోస్టును పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ చేసింది.

    ఇప్పటివరకు ఆర్‌బీఐ ఇటువంటి ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది.

    వివరాలు 

    ఫేక్ వార్తలను ప్రజలు నమ్మకండి 

    రూ.500 నోట్లను చట్టబద్ధంగా చలామణిలో ఉంచుతున్నట్టు కేంద్రం స్పష్టంగా తెలిపింది.

    అవి ఇప్పటికీ చెల్లుబాటు అయ్యే నోట్లేనని, వాటిని నిలిపివేస్తున్నట్టు ఎలాంటి నిర్ణయం లేదని వివరించింది.

    సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు పెరుగుతున్నప్పటికీ, ఇలాంటి ఫేక్ వార్తలపై ప్రజలు నమ్మకుండాల్సిందిగా సూచించింది.

    అదేవిధంగా, ఏదైనా ఆశ్చర్యకరమైన వార్తలు వచ్చినప్పుడు వాటిని నమ్మేముందు లేదా షేర్ చేయేముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరణ పొందాలని కోరింది.

    వివరాలు 

    రూ.500 నోట్ల విషయంలో అసత్య ప్రచారం

    అయితే 2016లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన డీమానిటైజేషన్ ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

    ఆ ప్రకటనతో రూ.1000, రూ.500 నోట్లు రద్దు అయ్యాయి. అనంతరం కొత్త రూపంలో రూ.500 నోట్లు, రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టారు.

    ప్రస్తుతం రూ.500 నోట్లు విస్తృతంగా చలామణిలో ఉన్నప్పటికీ, రూ.2 వేల నోట్లు మాత్రం మార్కెట్లో కనిపించడంలేదు.

    ఎందుకంటే ఆ నోట్లను దశలవారీగా ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా రూ.500 నోట్ల విషయంలోనూ అలాగే చేస్తారనే అసత్య ప్రచారం సోషల్ మీడియాలో పుట్టుకొస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సోషల్ మీడియా

    తాజా

    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా
    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్
    Single Movie OTT Release: ఓటీటీలోకి వచ్చిన 'సింగిల్‌'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? అమెజాన్ ప్రైమ్

    సోషల్ మీడియా

    ఎస్‌ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టిన భార్య పిల్లలు ఉత్తర్‌ప్రదేశ్
    భారత్‌లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి ఫేస్ బుక్
    మధ్యప్రదేశ్‌లో మరో దారుణం, ఓ వ్యక్తిని బట్టలు విప్పి, పైపులతో కొట్టారు మధ్యప్రదేశ్
    ట్విట్టర్ లోగో నుంచి పక్షి బొమ్మ ఔట్; కొత్త డిజైన్‌పై మస్క్ ఫోకస్ ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025