NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Gold: భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Gold: భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి 
    భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి

    Gold: భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 05, 2025
    03:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిగుమతి సుంకం తగ్గడంతో దేశంలో బంగారానికి గిరాకీ పెరిగింది. దీని ద్వారా పెళ్లిళ్ల , పండగ సీజన్‌ కారణంగా 2024లో పసిడి డిమాండ్‌ 5% పెరిగి 802.5 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) వెల్లడించింది.

    ఈ ఏడాదిలో కూడా పుత్తడి గిరాకీ ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది.

    వివరాలు 

    గణాంకాలు విడుదల చేసిన ప్రపంచ స్వర్ణ మండలి 

    2024 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా పసిడి వినియోగంపై ప్రపంచ స్వర్ణ మండలి (WGC) బుధవారం గణాంకాలు విడుదల చేసింది.

    వాటి ప్రకారం, 2023లో బంగారం గిరాకీ 761 టన్నులు ఉండగా, గతేడాది అది 802.8 టన్నులకు పెరిగింది.

    ''2025లో బంగారం గిరాకీ 700-800 టన్నుల మధ్య ఉండొచ్చని అంచనా వేయబడింది. అయినప్పటికీ, ఈ ఏడాది ధరల్లో కొంత స్థిరత్వం ఉండొచ్చని భావిస్తున్నాం. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరగవచ్చు'' అని WGC రీజినల్‌ సీఈఓ సచిన్‌ జైన్‌ పేర్కొన్నారు.

    దిగుమతి సుంకాలు తగ్గించినప్పటికీ గత ఏడాది కాలంలో దేశీయ మార్కెట్లో పసిడి ధర విపరీతంగా పెరిగింది.

    వివరాలు 

    73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    కొన్ని నగరాల్లో పది గ్రాముల పుత్తడి ధర రూ.86,000 పైగా పలుకుతోంది.

    గతేడాది బంగారంలో పెట్టుబడులు 29% పెరిగి 239.4 టన్నులకు చేరినట్లు సచిన్ జైన్ వెల్లడించారు.

    2013 తర్వాత పసిడి పెట్టుబడుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 2023లో ఈ మొత్తం 185.2 టన్నులుగా ఉంది.

    ఇక, గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు సచిన్ జైన్ వెల్లడించారు.

    2023లో కొనుగోలు చేసిన 16 టన్నులతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

    యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను దృష్టిలో పెట్టుకొని రిస్కును తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్ర బ్యాంకు బంగారం నిల్వలను పెంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగారం

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    బంగారం

    బంగారంపై ఇజ్రాయెల్‌-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం దిగుమతి సుంకం
    Zakia Wardak-Resigned: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ దౌత్యవేత్త రాజీనామా ఆఫ్ఘనిస్తాన్
    Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర.. కిలో పై రూ.6.20 లక్షలు తగ్గింపు ధర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025