NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / EPFO Wage ceiling: ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపుపై కేంద్రం త్వరలోనే నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    EPFO Wage ceiling: ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపుపై కేంద్రం త్వరలోనే నిర్ణయం 
    ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపుపై కేంద్రం త్వరలోనే నిర్ణయం

    EPFO Wage ceiling: ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపుపై కేంద్రం త్వరలోనే నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 11, 2024
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు త్వరలో శుభవార్త చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి.

    ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని (EPFO Wage Ceiling) పెంచాలని కేంద్రం యోచిస్తోంది.

    త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయంపై విశ్వసనీయ వర్గాల ఆధారంగా 'ఎకనామిక్ టైమ్స్' పత్రిక కథనం వెలువరించింది.

    ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితి రూ. 15,000గా ఉండగా, దానిని రూ. 21,000కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    వివరాలు 

    ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆర్థిక భారం

    అంతేకాకుండా, కంపెనీల ఈపీఎఫ్‌ఓ నమోదు విషయంలో ఉద్యోగుల సంఖ్య పరిమితిని కూడా తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

    ప్రస్తుతం 20 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు తప్పనిసరిగా ఈపీఎఫ్‌ఓలో నమోదు చేయాల్సి ఉంటుంది.

    కానీ ఈ సంఖ్యను 10-15కి తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనకు చిన్న-మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

    వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆర్థిక భారం పడుతుంది.

    కానీ, దీని వలన ఉద్యోగులకు భవిష్యత్తులో మంచి ప్రయోజనం కలుగుతుంది. ఈపీఎఫ్‌ఓ Wage Ceilingని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచారు.

    వివరాలు 

    వేతన పరిమితి పెంపుతో ప్రయోజనాలు 

    వేతన పరిమితిని పెంచితే, ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది.

    సాధారణంగా, ఉద్యోగి తన వేతనంలో 12% ,యజమాని కూడా 12% చెల్లిస్తారు.

    ఇందులో ఉద్యోగి వాటా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలోకి వెళ్తుంది. యజమాని వాటా నుంచి 8.33% పింఛను పథకంలోకి వెళ్ళగా, మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది.

    వేతన పరిమితిని పెంచితే, ఆ మేరకు ఉద్యోగి,యజమాని చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. దీని వలన, ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో తన భవిష్య నిధి నిల్వలను మరింత పెంచుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక  తాజా వార్తలు
    ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025