LOADING...
GST: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. రెండు శ్లాబ్‌ల రద్దు
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. రెండు శ్లాబ్‌ల రద్దు

GST: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. రెండు శ్లాబ్‌ల రద్దు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
10:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం నాలుగు జీఎస్టీ శ్లాబ్‌లు అమల్లో ఉండగా, ఇకముందు వాటిని తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారు. 12 శాతం,28 శాతం శ్లాబ్‌లను రద్దు చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మార్పులతో భవిష్యత్తులో కేవలం 5 శాతం, 18 శాతం శ్లాబ్‌లు మాత్రమే కొనసాగనున్నాయి. అలాగే విలాసవస్తువులపై 40% జీఎస్టీ విధించనున్నారు. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

వివరాలు 

కొత్త స్లాబ్‌ల అమలుతో పేద,మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం

నెక్ట్స్‌ జెనరేషన్ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు. జీఎస్టీలో రెండు మాత్రమే స్లాబ్‌లు కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా రైతులు,సామాన్య ప్రజల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జీఎస్టీ ఫైలింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తున్నట్లు తెలిపారు. కొత్త స్లాబ్‌ల అమలుతో పేద,మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని, పలు ఐటంలపై 0% జీఎస్టీ ఉండనుందని ఆమె స్పష్టంగా తెలిపారు. పేదలు, సామాన్యులు ఎక్కువగా వాడే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే ఉండనుందని, అన్ని రకాల టీవీలపై 18% జీఎస్టీ ఉంటుందని వెల్లడించారు.