NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / యూపీఐ ఏటీఎంలు వచ్చేస్తున్నాయి.. జస్ట్ స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు
    తదుపరి వార్తా కథనం
    యూపీఐ ఏటీఎంలు వచ్చేస్తున్నాయి.. జస్ట్ స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు
    యూపీఐ ఏటీఎం వచ్చేస్తోంది

    యూపీఐ ఏటీఎంలు వచ్చేస్తున్నాయి.. జస్ట్ స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 06, 2023
    02:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొవిడ్ కాలం తర్వాత భారత్‌లో యూపీఐ సేవలు మరింత దూసుకెళ్తున్నాయి. దీంతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్త్రృతమయ్యాయి. ఈ మేరకు కొత్తగా యూపీఐ(UPI-) ఏటీఎంలు వచ్చేస్తున్నాయి.

    ఈ క్రమంలోనే యూపీఐతో ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ ప్రత్యేక సాఫ్ట్ వేర్‌‌ను రూపొందించిన ఏటీఎంను ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ప్రదర్శించారు.

    ఏటీఎం తెరపై రూ. 100, రూ.500, రూ.1000, రూ.2000, రూ.5000 వేలను ఉపసంహరించేందుకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇది కాకుండా ఇతర అమౌంట్‌ కావాలంటే మరో ఆఫ్షన్ కూడా పొందుపర్చారు.

    ఈ నేపథ్యంలోనే మనకు కావాల్సిన నగదును స్క్రీన్ పై టచ్‌ చేస్తే డిస్‌ప్లేపై క్యూ ఆర్‌‌ కోడ్ వస్తుంది.

    DETAILS

    NPCI సహకారంతో అందుబాటులోకి క్యాష్ విత్‌డ్రా సేవలు 

    ఫోన్‌లోని ఏదైనా యూపీఐ యాప్‌ స్కానర్‌‌ను ఆన్ చేసి సదరు క్యూర్‌‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. తర్వాత పిన్‌ ఎంటర్‌‌ చేశాక, నగదు బయటకు వస్తుంది.

    ఎటువంటి ఏటీఎం కార్డు లేకుండానే అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకునే సౌకర్యం త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తాజా సేవలు దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతానికీ విస్తరించనున్నాయి.

    వైట్ లేబుల్ ఏటీఎంలతో హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ సేవలను అందించేందుకు ముందుకొచ్చింది.

    వీటిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో సురక్షితమైన క్యాష్ విత్‌డ్రా సేవలుగా అందుబాటులోకి తీసుకురానుంది.

    ఫిజికల్ కార్డుల అవసరాన్ని తొలగించడం ద్వారా వినియోగదారుల భద్రత పెరుగనున్నట్లు హిటాచీ ఎండీ, సీఈవో సుమిల్ వికామ్సే అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025