NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / US Tariffs: భారతీయ ఎగుమతులపై US టారిఫ్‌లు ప్రభావం తక్కువే : SBI
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    US Tariffs: భారతీయ ఎగుమతులపై US టారిఫ్‌లు ప్రభావం తక్కువే : SBI
    భారతీయ ఎగుమతులపై US టారిఫ్‌లు ప్రభావం తక్కువే : SBI

    US Tariffs: భారతీయ ఎగుమతులపై US టారిఫ్‌లు ప్రభావం తక్కువే : SBI

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 17, 2025
    11:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమ దేశ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతి సుంకంతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

    ఇందులో మిత్ర దేశమైన భారత్‌కు కూడా ఎలాంటి మినహాయింపు ఉండబోదని ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలోనే స్పష్టం చేశారు.

    దీంతో మన దేశంపై వాణిజ్య ఆంక్షలు ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    అయితే, అమెరికా సుంకాల (US Tariffs) పెంపు వల్ల భారత ఎగుమతులపై తక్కువ ప్రభావమే ఉంటుందని స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

    వివరాలు 

    మన ఎగుమతులపై కేవలం 3 నుండి 3.5 శాతం మాత్రమే

    "ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా అత్యధికంగా 15-20 శాతం వరకు సుంకాలు విధించినా, ఆ ప్రభావం మన దేశంపై పరిమితంగానే ఉంటుంది. మన ఎగుమతులపై కేవలం 3 నుండి 3.5 శాతం మాత్రమే ప్రభావం పడుతుంది. దాన్ని కూడా ఎగుమతుల లక్ష్యాలు పెంచుకొని తగ్గించుకునే అవకాశం మనకు ఉంది"అని ఎస్‌బీఐ తమ నివేదికలో పేర్కొంది.

    అంతేగాక, ఎగుమతుల్లో వ్యూహాత్మక వైవిధ్యం,విలువలు పెంచుకోవడం,కొత్త వాణిజ్య మార్గాలను అన్వేషించడం వంటి చర్యలతో అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది.

    ఐరోపా,మధ్యప్రాచ్యం,ఇతర దేశాలతో న్యూదిల్లీ వాణిజ్య బంధం పెరుగుతున్న వేళ,సరఫరా గొలుసును బలోపేతం చేసుకునే అవకాశాలపై భారత్ దృష్టిపెట్టొచ్చని పేర్కొంది.

    ఇలా చేయడం ద్వారా ఎగుమతుల్లో స్థిరత్వం సాధించగలమని అభిప్రాయపడింది.

    వివరాలు 

    సుంకాలు పెంచినా మనపై ప్రభావం తక్కువే

    భారత్ ఉత్పత్తులపై అమెరికా గత కొంతకాలంగా స్థిరమైన సుంకాలను విధిస్తోంది.

    ప్రస్తుతం మన దేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల సగటు రేటు 3.3% కాగా, అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టారిఫ్‌ల సగటు రేటు 17 శాతంగా ఉంది.

    భారత్‌కు అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువుల విలువలో 75% వరకు సగటు టారిఫ్ 5% లోపే ఉంది.

    అందువల్ల, సుంకాలు పెంచినా మనపై ప్రభావం తక్కువేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

    మన దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 27.8 బిలియన్ డాలర్ల ఔషధాలు ఎగుమతి కాగా, ఇందులో అమెరికాకే 31.35% చేరాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    తాజా

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్
    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Mumbai Airport: పార్కింగ్ విషయంలో డ్రైవర్లు, ముంబై విమానాశ్రయ సిబ్బంది మధ్య తీవ్రమైన ఘర్షణ  ముంబై

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..కార్డు లేకున్నా నగదు డ్రా చేసుకోవచ్చు బిజినెస్
    ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్ బ్యాంక్
    ఎస్​బీఐతో జట్టు కట్టిన రిలయెన్స్.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు రిలయెన్స్
    SBI MCap: ఒక్కరోజే 10% పెరిగిన ఎస్‌బీఐ షేరు.. ఏకంగా రూ.8 లక్షల కోట్ల మార్కుతో ఘనత!  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025