NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌
    తదుపరి వార్తా కథనం
    Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌
    4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌

    Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2025
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

    దేశ స్థూల దేశీయోత్పత్తి 4 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవడంతో భారత్‌ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.

    పదో నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.

    ప్రపంచంలో ఆర్థికంగా ఉన్న అస్థిరతలూ, సవాళ్లూ ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుండడం గమనార్హమని పేర్కొన్నారు.

    పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ మారడం వల్ల ఈ స్థాయికి చేరగలిగిందని అన్నారు.

    ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే మనకంటే ముందున్న దేశాలని, ఇలానే కొనసాగితే, మూడేళ్లలో భారత్‌ జర్మనీకూ మించి, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

    Details

    భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర

    ఈ లక్ష్య సాధనలో మూలధన వ్యయాలు పెంపు, సులభమైన వ్యాపార నిర్వహణ విధానం, తక్కువ ఖర్చుతో వ్యాపార నిర్వహణ, తయారీలో కార్మికులకు ప్రాధాన్యత, అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి వంటి అంశాలు కీలకమని పేర్కొన్నారు.

    వేగంగా విస్తరిస్తున్న దేశీయ డిజిటల్‌ మార్కెట్‌ రాబోయే దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించనుందని తెలిపారు.

    ఇక మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ ఘనతపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. భారత్‌ వికసిత దేశంగా మారే దిశగా ఇది ఒక గొప్ప అడుగు అని అభివర్ణించారు.

    ఈ విజయం సాధించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్రను ప్రశంసిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నీతి ఆయోగ్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    నీతి ఆయోగ్

    NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా నరేంద్ర మోదీ
    Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025