NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు 
    భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 20, 2025
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌,అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలి దశను వేగంగా పూర్తి చేయడానికి ఇరుదేశాలు చర్చలను మరింత వేగవంతం చేశాయి.

    ఈ నేపథ్యంలో, కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌తో సమావేశమయ్యారు.

    ఈ భేటీలో మొదటి దశ ఒప్పందాన్ని త్వరితంగా పూర్తిచేయాలనే దిశగా ఫలప్రదమైన చర్చలు జరిగాయని గోయల్ ఎక్స్‌ (పూర్వం ట్విట్టర్) వేదికగా తెలిపారు.

    ఈ మంత్రుల స్థాయి చర్చల అనంతరం,ఇరుదేశాల ప్రధాన చర్చాకర్తల మధ్య సమావేశాలు ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్నాయి.

    వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలన్నదే ఇరుపక్షాల లక్ష్యం.

    వివరాలు 

    పలు కీలక రంగాల్లో సుంకాల నుంచి మినహాయింపు కోరిన భారత్ 

    ఈ చర్చలలో ప్రధానంగా పరస్పర మార్కెట్ల ప్రాప్తి, స్థానిక చట్టాల అమలు, టారిఫ్ మినహాయింపులకు సంబంధించి పరిమితులపై చర్చలు జరగనున్నాయి.

    ఈ ఒప్పందంలో భాగంగా భారత్ పలు కీలక రంగాల్లో సుంకాల నుంచి మినహాయింపు కోరుతోంది.

    ఇందులో ముఖ్యంగా టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపండ్ల వంటివి ఉన్నాయి. ఇదే సమయంలో, అమెరికా కూడా కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమొబైళ్లలో (ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు), వైన్స్, పెట్రోకెమికల్స్, పాడి ఉత్పత్తులపై సుంకాల్లో తగ్గింపును కోరుతోంది.

    వివరాలు 

    యథాతథంగా  10 శాతం బేస్‌లైన్‌ సుంకం 

    ఈ ఒప్పందానికి సంబంధించి ఇరుదేశాలు కొన్ని నిబంధనలను ఇప్పటికే ఖరారు చేశాయి.

    ఇందులో సుంకాలు, వస్తువుల, సేవల పరస్పర మార్పిడి, సుంకేతర అడ్డంకులు, కస్టమ్స్ వ్యవహారాలు వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి.

    ఇప్పటికే అమెరికా, భారత్‌పై విధించిన అదనపు 26 శాతం సుంకాలను జూలై 9వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో, ఈ 90 రోజుల గడువును సద్వినియోగం చేసుకుంటూ చర్చలను పురోగతిలోకి తీసుకెళ్లాలని ఇరుదేశాలు సంకల్పించాయి.

    అయితే ప్రస్తుతం 10 శాతం బేస్‌లైన్‌ సుంకం యథాతథంగా కొనసాగుతోంది.

    వాణిజ్య లోటును నియంత్రించేందుకు టారిఫ్ చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా గత ఏప్రిల్ 2న ప్రకటించిన సంగతి తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పీయూష్ గోయెల్‌

    తాజా

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్

    పీయూష్ గోయెల్‌

    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  బ్రిక్స్ సమ్మిట్
    పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ రాజ్యసభ
    Tesla : భారత్‎లోకి టెస్లా.. పీయూష్‌ గోయల్‌తో మస్క్‌ భేటీ ఎప్పుడో తెలుసా టెస్లా
    Piyush Goyal: ఎగ్జిట్ పోల్ తర్వాత భారతీయ పెట్టుబడిదారులు లాభాలు పొందారు,రాహుల్‌కి ఏమీ తెలియదు;బీజేపీ ఎదురుదాడి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025