NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,000
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,000
    లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,000

    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,000

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    10:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, కనిష్ఠాల వద్ద మదుపర్ల కొనుగోళ్ల కారణంగా మార్కెట్ లాభాల బాట పట్టింది.

    ప్రధాన కంపెనీలైన ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు దూకుడుగా ఉన్నాయి.

    మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 200 పాయింట్ల పైగా లాభంతో ప్రారంభమై, నిఫ్టీ 23,100 మార్క్‌ పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

    వివరాలు 

     బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌ 79.30 డాలర్లు 

    ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో 77,118 వద్ద ఉండగా, నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 23,085 వద్ద ట్రేడవుతోంది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌టీ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    ఇక, జొమాటో, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌ 79.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,764.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 86.59 వద్ద ఉంది.

    వివరాలు 

     లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

    అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    హాంగ్‌సెంగ్‌, షాంఘై సూచీలు నష్టాల్లో ఉంటే, జపాన్‌ నిక్కీ, ఏఎస్‌ఎక్స్‌ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ. 5,920 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 3,500 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    స్టాక్ మార్కెట్

    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 78,472 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు  బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800  బిజినెస్
    Upcoming IPOs: ఈ వారంలో ఐపీఓల హవా.. 3 సబ్‌స్క్రిప్షన్లు, 6 లిస్టింగ్‌లు ఐపీఓ
    Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025