NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,150 దిగువన ట్రేడవుతున్న నిఫ్టీ 
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,150 దిగువన ట్రేడవుతున్న నిఫ్టీ 
    ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,150 దిగువన ట్రేడవుతున్న నిఫ్టీ

    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,150 దిగువన ట్రేడవుతున్న నిఫ్టీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ట్రేడింగ్ ప్రారంభించాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పుడు, సూచీలు మొదట ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి, కానీ కాసేపటికే నష్టాలకు లోనయ్యాయి.

    ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 232 పాయింట్లు క్షీణించి 79,696 వద్ద ట్రేడవుతోంది.

    అదే సమయంలో నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 24,127 వద్ద కొనసాగింది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    మిశ్రమంగా కదలాడుతున్నఆసియా-పసిఫిక్ మార్కెట్లు 

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.17 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్సు ధర 2,679 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.78 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి, అలాగే ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

    గత 12 రోజులుగా విక్రయదారులుగా నిలిచిన విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.1,507 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.22 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    వివరాలు 

     ఐటీ రంగం కంపెనీల ఫలితాలపై మదుపరులు ఆసక్తి

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడవ త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో ఐటీ రంగం కంపెనీల ఫలితాలపై మదుపరులు ఆసక్తిగా ఉన్నారు.

    ఇటువంటి సమయంలో ఐటీ రంగం కొంత స్థిరపడిన నేపథ్యంలో, దేశీయ కంపెనీలు మెరుగైన పనితీరు ప్రదర్శిస్తాయని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్

    స్టాక్ మార్కెట్

    Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం బిజినెస్
    Stock market:  నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 58 పాయింట్లు చొప్పున నష్టం  సెన్సెక్స్
    Stock market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,600 ఎగువన నిఫ్టీ  బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025