NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు
    ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు

    Infosys: ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మంది తొలగింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 07, 2025
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు కొన్ని ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు కొత్తవి కావు. వాటిలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.

    కరోనా సమయంలో ఫ్రెషర్ల పట్ల ఇన్ఫోసిస్ తన కఠిన వైఖరిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

    నియామక ప్రక్రియలో భారీ ఆలస్యం చేసింది. ఆఫర్ లెటర్‌లో పేర్కొన్న వార్షిక వేతనం కంటే తక్కువ ఆఫర్‌తో చేరాలనే షరతులను విధించిందని అప్పట్లో ఆరోపణలొచ్చాయి.

    పరీక్షల పేరుతో కొందరిని తిరస్కరించిందన్న అభియోగాలు కూడా వినిపించాయి.

    అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మెరుగుపడడంతో ఐటీ కంపెనీలు మళ్లీ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి

    Details

    400 మంది ట్రైనీలకు ఉద్వాసన 

    తాజాగా ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న 400 మంది ట్రైనీలను తొలగిస్తున్నట్లు సమాచారం. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన ట్రైనీలకు సంస్థ ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది.

    రెండున్నర సంవత్సరాల నిరీక్షణ తర్వాత శిక్షణ పొందిన వారిలో సగం మందిని తొలగించేయడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.

    ఇన్ఫోసిస్ స్పందన

    ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన విడుదల చేసింది. సంస్థలో ఫ్రెషర్లు శిక్షణ పూర్తయిన తర్వాత అంతర్గత అంచనాలను తప్పనిసరిగా క్లియర్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

    మూడు అవకాశాలు ఇచ్చినా పాస్ కాకపోతే ఉద్యోగంలో కొనసాగించే అవకాశం లేదని వెల్లడించింది.

    క్లయింట్లకు అత్యున్నత స్థాయి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించాలనే ఉద్దేశంతోనే ఈ నియమావళిని పాటిస్తున్నామని పేర్కొంది.

    Details

    ట్రైనీల ఆందోళన

    ట్రైనీలను 50 మందితో కూడిన బ్యాచ్‌లుగా పిలిచి, ఉద్యోగ విరమణ ఒప్పంద పత్రాలపై సంతకం చేయిస్తున్నట్లు సమాచారం.

    పరీక్షలు కావాలనే కఠినంగా పెట్టారని, తమకు సముచిత అవకాశం ఇవ్వలేదని, భవిష్యత్తు గురించి ఆలోచించగానే భయం వేస్తోందని ఓ ట్రైనీ వాపోయాడు.

    ఇక ట్రైనీలు తమ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లకుండా ఉండేందుకు భద్రతా సిబ్బందిని మోహరించారని వర్గాలు చెబుతున్నాయి.

    Details

    సాయంత్రం 6 గంటలలోపు క్యాంపస్‌ను ఖాళీ చేయాలంటూ ఆదేశాలు

    సాయంత్రం 6 గంటలలోపు క్యాంపస్‌ను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

    ఈ ఘటనపై నసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనెట్‌ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.

    ఈ కార్పొరేట్ దోపిడీని ఆపాలని, భారతీయ ఐటీ ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని NITES ప్రతినిధి హర్ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు.

    ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇన్ఫోసిస్
    భారతదేశం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఇన్ఫోసిస్

    Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం  బిజినెస్
    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్  ఉద్యోగులు
    Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి  డీప్‌ఫేక్‌
    Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు  విప్రో

    భారతదేశం

    India-China: ఎల్‌ఏసీపై పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి ?  చైనా
    Medicines Fail: దేశంలో 49 రకాల మందులు నాణ్యతలో ఫెయిల్.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఇండియా
    India's defence exports: రూ.22,000 కోట్లకు చేరుకున్నభారతదేశ రక్షణ ఎగుమతులు..అమెరికాతో సహా మన దగ్గర కొనుగోలు చేసే దేశాలు ఇవే.. భారతదేశం
    Tejas Mk1a: జీఈ ఏరోస్పేస్ పై  భారత్ భారీ జరిమానా: తేజస్ MK1A ఇంజిన్ల డెలివరీ ఆలస్యంపై కేంద్రం చర్య  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025