
Upcoming IPOs:వచ్చే వారంలో నిధుల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి రానున్న ఆరు సంస్థలు..స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్న 5 లిస్టింగ్లు
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్ నుంచి మూలధనాన్ని సమీకరించాలనే ఉద్దేశంతో వచ్చే వారం ఆరు సంస్థలు తమ ప్రాథమిక షేర్ విక్రయాలను (ఐపీఓలు) తీసుకువస్తున్నాయి.
వీటిలో ఒకటి ప్రధాన బోర్డు నుంచి కాగా, మిగతా ఐదు సంస్థలు ఎస్ఎంఈ విభాగం నుంచి ఉన్నాయి.
ఇదే సమయంలో, ఇప్పటికే సబ్స్క్రిప్షన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న ఐదు సంస్థలు మార్కెట్లో లిస్టింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
వివరాలు
అరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్
ప్రధాన బోర్డు నుండి రానున్న సంస్థ అరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ (Arisinfra Solutions) ఐపీఓ జూన్ 18న ప్రారంభమై 20న ముగియనుంది.
ఈ షేర్ల ధరల శ్రేణిని రూ.210 నుండి రూ.222 వరకు నిర్ణయించారు.
కంపెనీ ఈ ద్వారా మొత్తం రూ.499.60 కోట్లు సమీకరించాలనుకుంటోంది.
ఈ ఇష్యూకు జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్లు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు.
వివరాలు
పాటిల్ ఆటోమేషన్
ఎస్ఎంఈ విభాగంలో పాటిల్ ఆటోమేషన్ (Patil Automation) సంస్థ ఐపీఓ ద్వారా రూ.69.61 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మొత్తం నిధులు తాజా షేర్ల విడుదల ద్వారా సమీకరించనుంది. ఇందులో భాగంగా 58 లక్షల షేర్లు జారీ చేయనుంది.
షేర్ల ధరలను రూ.114 నుండి రూ.120 మధ్యలో నిర్ణయించారు. ఈ ఐపీఓ జూన్ 16న ప్రారంభమై 18న ముగియనుంది.
ఎప్పెల్టోన్ ఇంజినీర్స్
ఎప్పెల్టోన్ ఇంజినీర్స్ (Eppeltone Engineers) సంస్థ రూ.43.96 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు వస్తోంది. షేర్ ధరల శ్రేణి రూ.25 నుండి రూ.128 వరకు నిర్ణయించారు.
ఈ ఇష్యూ జూన్ 17న ప్రారంభమై 19న ముగియనుంది. ఇందులో భాగంగా 34.34 లక్షల తాజా షేర్లు మార్కెట్లో విడుదల చేయనున్నారు.
వివరాలు
సమయ్ ప్రాజెక్ట్ సర్వీసెస్
సమయ్ ప్రాజెక్ట్ సర్వీసెస్ (Samay Project Services) సంస్థ రూ.14.69 కోట్లు సమీకరించే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది.
ఈ ఐపీఓ జూన్ 16న ప్రారంభమై 18న ముగియనుంది. షేర్ల ధరలను రూ.32 నుండి రూ.34 మధ్యలో నిర్ణయించారు. మొత్తం 43 లక్షల తాజా షేర్లు మార్కెట్లో విడుదల చేయనున్నారు.
ఇన్ఫ్లక్స్ హెల్త్టెక్
ఇన్ఫ్లక్స్ హెల్త్టెక్ (Influx Healthtech) కంపెనీ ఐపీఓ ద్వారా రూ.58.57 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో జూన్ 18న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ ఇష్యూ జూన్ 20తో ముగియనుంది.
షేర్ ధరల శ్రేణి రూ.91-96గా నిర్ణయించారు. ఇందులో 50 లక్షల తాజా షేర్లు, 11 లక్షల ఆఫర్ ఫర్ సేల్ షేర్లు జారీ చేయనున్నారు.
వివరాలు
మాయాషీల్ వెంచర్స్
ఎస్ఎంఈ విభాగం నుంచి రానున్న మరో సంస్థ మాయాషీల్ వెంచర్స్ (Mayasheel Ventures) ఐపీఓ జూన్ 20న ప్రారంభమై 24న ముగియనుంది.
షేర్ ధరల శ్రేణి రూ.44-47గా నిర్ణయించారు. కంపెనీ ఈ ద్వారా రూ.27.28 కోట్లు సమీకరించే అవకాశముంది.
ఇప్పటికే లిస్టింగ్కు సిద్ధమైన ఐపీఓలు
ప్రధాన బోర్డు విభాగంలో ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తిచేసుకున్న ఓస్వాల్ పంప్స్ జూన్ 18న, సోలార్ పంప్స్ జూన్ 20న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.
ఎస్ఎంఈ విభాగంలో సచీరోమ్ (జూన్ 16), మోనోలిథిష్ ఇండియా (జూన్ 17), జైనిక్ పవర్ అండ్ కేబుల్స్ (జూన్ 19) లిస్ట్ అవుతున్నాయి.