Page Loader
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కారణం
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కారణం

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కారణం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాల ప్రభావంతో మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, చివరి వరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరికి, సెన్సెక్స్ 147 పాయింట్లు పెరిగి 74,602 వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 22,547 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 87.20 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, నెస్లే ప్రధాన లాభదారులుగా నిలిచాయి. మరోవైపు, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, ట్రెంట్ నష్టాలను చవిచూశాయి.

వివరాలు 

0.5% క్షీణించిన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు

రంగాల వారీగా చూస్తే, ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ రంగాలు 0.5%-1% వరకు పడిపోయాయి. అయితే, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం రంగాలు 0.5% మేర లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5% క్షీణించాయి. ఇక మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న మార్కెట్ మూసివేయబడుతుందని ప్రకటించారు.