NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,668.65
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,668.65
    ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,668.65

    Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,668.65

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2025
    04:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్థిరంగా ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలకు టారిఫ్‌ల నుంచి రిలీఫ్ ఇస్తామని సంకేతాలు ఇవ్వడంతో, దేశీయ సూచీలు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అయితే, ఇంట్రాడేలో ఈ ప్రారంభ లాభాలు తగ్గిపోయి,సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.

    చివరికి, స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి. ఇది వరుసగా ఏడో రోజు సూచీలు లాభాలతో ముగియడం గమనార్హం.

    ముఖ్యంగా ఐటీ రంగ షేర్లు బలంగా కొనసాగాయి.మరోవైపు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1%కు పైగా నష్టాలను చవిచూశాయి.

    వివరాలు 

    నిఫ్టీ 10.30 పాయింట్ల లాభం

    సెన్సెక్స్ ఈరోజు ఉదయం 78,296.28 పాయింట్ల వద్ద (గత ముగింపు 77,984.38) లాభాలతో ప్రారంభమైంది.

    ఇంట్రాడేలో 78,741.69 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, అమ్మకాల ఒత్తిడితో దాదాపు వెయ్యి పాయింట్ల మేర క్షీణించి, 77,745.63 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకుంది.

    చివరకు 32.81 పాయింట్లు పెరిగి, 78,017.19 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10.30 పాయింట్ల లాభంతో 23,668.65 వద్ద స్థిరపడింది.

    విదేశీ మారకంలో, డాలరుతో రూపాయి మారకం విలువ 16 పైసలు పడిపడి, రూ.85.77గా నమోదైంది.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 73.46 డాలర్లు 

    సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలు సాధించాయి.

    జొమాటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 73.46 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,027 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    స్టాక్ మార్కెట్

    Stock market crash: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు,నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం! బిజినెస్
    Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్‌ సూచీలు.. బిజినెస్
    Stock market: మరోసారి నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,119  బిజినెస్
    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025