Page Loader
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 23,200ఎగువన నిఫ్టీ
లాభాల్లో ముగిసిన సూచీలు.. 23,200ఎగువన నిఫ్టీ

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 23,200ఎగువన నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజున లాభాల్లో ముగిశాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, రోజంతా అదే ట్రెండ్‌లో కొనసాగాయి. రిలయన్స్‌, జొమాటో, ఎన్టీపీసీ షేర్లలో కొనుగోళ్లతో సూచీలకు బలమైన మద్దతు లభించింది. ఫలితంగా, సెన్సెక్స్‌ 224 పాయింట్ల లాభంతో ముగిసింది, అలాగే నిఫ్టీ 23,200 పాయింట్ల దిశగా ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 76,900.14 వద్ద లాభాలతో ప్రారంభమై, ఇంట్రాడేలో 76,991.05 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 80.12 డాలర్లు 

చివరకు, 76,724.08 వద్ద 224 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 23,293.65 వద్ద గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది, తర్వాత 23,213 వద్ద 37 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో జొమాటో, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పోర్ట్స్‌ లాభపడాయి. కాగా, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 80.12 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా,బంగారం ఔన్సు ధర 2,707.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.37 వద్ద స్థిరంగా ఉంది.