English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : నేడు ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : నేడు ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800 
    నేడు ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800

    Stock Market : నేడు ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రోజున స్థిరంగా ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపించాయి.

    ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప లాభాల్లో కనిపించిన సూచీలు, కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.

    ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 164 పాయింట్ల నష్టంతో 81,386 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 24,809 వద్ద ట్రేడవుతున్నాయి.

    సెన్సెక్స్‌కు చెందిన 30 ప్రధాన షేర్లలో ఐటీసీ, టైటాన్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎటర్నల్, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    వివరాలు 

    లాభాలతో ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్లు

    మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్ పరంగా చూస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.49 డాలర్ల వద్ద, బంగారం ఔన్సుకు 3,293 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.

    నాస్‌డాక్ 22.47 శాతం, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్ 2.05 శాతం, డౌజోన్స్ 1.78 శాతం పెరిగాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    రూ.10,105 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన దేశీయ సంస్థాగత మదుపదారులు

    ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌, జపాన్‌ నిక్కీ సూచీలు స్థిరంగా కొనసాగుతుండగా, హాంగ్‌సెంగ్‌, షాంఘై సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపదారులు (FIIs) మంగళవారం నికరంగా రూ.348 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    అలాగే దేశీయ సంస్థాగత మదుపదారులు (DIIs) కూడా నికరంగా రూ.10,105 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Surya 46 : నేటి నుంచి 'సూర్య 46' షూటింగ్ ప్రారంభం.. కొత్త పోస్టర్ వైరల్ ! సూర్య
    Father's Day 2025: ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకి 'హీరో'లా ఇలా స్పేషల్ గిఫ్ట్ ఇవ్వండి! ప్రేరణ
    UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం  యూపీఐ
    Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన మంధాన.. రెండో స్థానంలో భారత స్టార్ బ్యాటర్ ఐసీసీ

    స్టాక్ మార్కెట్

    Stock market: సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభం.. 12 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ.. బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. బిజినెస్
    Stock Market: నేడు ఫ్లాట్‌గా రోజును ప్రారంభించిన దేశీయ మార్కెట్ సూచీలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025