
Stock Market : నేడు ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,800
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రోజున స్థిరంగా ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపించాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప లాభాల్లో కనిపించిన సూచీలు, కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.
ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 164 పాయింట్ల నష్టంతో 81,386 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 24,809 వద్ద ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్కు చెందిన 30 ప్రధాన షేర్లలో ఐటీసీ, టైటాన్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎటర్నల్, మారుతీ సుజుకీ, ఎల్అండ్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్యూఎల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
వివరాలు
లాభాలతో ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్లు
మరోవైపు హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ పరంగా చూస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 64.49 డాలర్ల వద్ద, బంగారం ఔన్సుకు 3,293 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.
నాస్డాక్ 22.47 శాతం, ఎస్అండ్పీ 500 ఇండెక్స్ 2.05 శాతం, డౌజోన్స్ 1.78 శాతం పెరిగాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
వివరాలు
రూ.10,105 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన దేశీయ సంస్థాగత మదుపదారులు
ఆస్ట్రేలియాలోని ఏఎస్ఎక్స్, జపాన్ నిక్కీ సూచీలు స్థిరంగా కొనసాగుతుండగా, హాంగ్సెంగ్, షాంఘై సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపదారులు (FIIs) మంగళవారం నికరంగా రూ.348 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
అలాగే దేశీయ సంస్థాగత మదుపదారులు (DIIs) కూడా నికరంగా రూ.10,105 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.