Stock Market: ఫ్లాట్గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ట్రేడింగ్ను ప్రారంభించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావంతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూచీలు స్వల్పంగా ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.
ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 23,800 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 18 పాయింట్ల లాభంతో 77,886 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 23,763 వద్ద కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జొమాటో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
లాభాలతో ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్
మరోవైపు, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, సన్ఫార్మా, హెచ్యూఎల్, హెచ్సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.
డాలర్తో రూపాయి మారకం విలువ రూ.87.13 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం ఔన్సు 2,883.70 డాలర్ల వద్ద కదలాడుతోంది.
అమెరికా స్టాక్ మార్కెట్లు చివరి ట్రేడింగ్ సెషన్లో లాభాలతో ముగిశాయి.
ప్రధాన సూచీలు అయిన ఎస్ అండ్ పీ 500 0.72 శాతం, డోజోన్స్ 0.30 శాతం, నాస్డాక్ 1.35 శాతం లాభపడ్డాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రధాన సూచీలు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
వివరాలు
రూ.809 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు
కొన్నాళ్లుగా షేర్లను భారీగా విక్రయించిన విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్ సెషన్లో నికరంగా రూ.809 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.431 కోట్ల షేర్లను విక్రయించారు.