NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 05, 2025
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావంతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో సూచీలు స్వల్పంగా ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.

    ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 23,800 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 18 పాయింట్ల లాభంతో 77,886 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 23,763 వద్ద కొనసాగుతున్నాయి.

    సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    లాభాలతో ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్

    మరోవైపు, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.87.13 వద్ద కొనసాగుతోంది.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం ఔన్సు 2,883.70 డాలర్ల వద్ద కదలాడుతోంది.

    అమెరికా స్టాక్ మార్కెట్లు చివరి ట్రేడింగ్ సెషన్‌లో లాభాలతో ముగిశాయి.

    ప్రధాన సూచీలు అయిన ఎస్ అండ్ పీ 500 0.72 శాతం, డోజోన్స్ 0.30 శాతం, నాస్‌డాక్ 1.35 శాతం లాభపడ్డాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రధాన సూచీలు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    రూ.809 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు

    కొన్నాళ్లుగా షేర్లను భారీగా విక్రయించిన విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ.809 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.431 కోట్ల షేర్లను విక్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    స్టాక్ మార్కెట్

    Standard Glass Lining: స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ ఐపీఓకు 23% ప్రీమియంతో లిస్టింగ్‌ హైదరాబాద్
    Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ వ్యాపారం
    Stock Market: మదుపర్ల కొనుగోళ్ల జోరు.. లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు ఇన్ఫోసిస్
    HCL Tech: హెచ్‌సీఎల్ టెక్‌ షేర్లు 10శాతం పతనం.. రూ. 46,987 కోట్లు ఆవిరైన మార్కెట్ విలువ అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025