NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్‌ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ
    తదుపరి వార్తా కథనం
    PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్‌ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ
    పీఎం ఇ- డ్రైవ్‌ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ

    PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్‌ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 30, 2024
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్‌ (PM E-DRIVE) పథకాన్ని తీసుకొచ్చింది.

    ఈ పథకం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా విద్యుత్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

    దిల్లీలో భారత్‌ మండపంలో ఈ పథకం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొననున్నారు.

    Details

    పీఎం ఇ-డ్రైవ్ పథకం కోసం రూ.10,900 కోట్లు

    పీఎం ఇ-డ్రైవ్ పథకం కోసం రూ.10,900 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా తెలిపింది.

    ఈ పథకం కింద విద్యుత్ టూ వీలర్లు, త్రీవీలర్లు, ఇ-అంబులెన్సులు, ఇ-ట్రక్కులకు కేంద్రం రాయితీలను అందించనుంది.

    పథకం అమలులో ఉన్న కాలంలో బస్సులకు రూ.4,391 కోట్లు, టూవీలర్లకు రూ.1,772 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు.

    2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ టూవీలర్, త్రీవీలర్‌ కేటగిరీలకు కిలోవాట్‌కు రూ.5000, మరుసటి ఏడాది రూ.2,500 చొప్పున రాయితీ ఇస్తారు.

    Details

    ఇ-రిక్షాలకు రూ.25 వేలు రాయితీ

    టూవీలర్‌కి గరిష్ఠంగా రూ.10 వేలు, ఇ-రిక్షాలకు రూ.25 వేలు రాయితీ లభించనుంది.

    2025-26లో టూవీలర్‌లకు రూ.5 వేలు, ఇ-రిక్షాలకు రూ.12,500 వరకు రాయితీ ఇవ్వనున్నారు.

    ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇప్పటికే ఫేమ్-1, ఫేమ్-2 పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే.

    2015లో ప్రారంభించిన ఫేమ్-1 పథకం తర్వాత, 2019లో రూ.11,500 కోట్లతో ఫేమ్-2 పథకాన్ని తీసుకొచ్చారు. ఇది 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.

    'పీఎం ఇ-డ్రైవ్' పథకం విద్యుత్ వాహన రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    దిల్లీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కేంద్ర ప్రభుత్వం

    IVF Case: మూసేవాలా తల్లికి IVF చికిత్స.. చట్టబద్ధతను ప్రశ్నించిన కేంద్రం  భగవంత్ మాన్
    Supreme Court : యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో సీబీఐ లేదు: సుప్రీంకోర్టులో కేంద్రం సుప్రీంకోర్టు
    PM Modi : ఫలించిన మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం.. 5 మంది భారతీయ నావికులను విడుదల చేసిన ఇరాన్  భారతదేశం
    India's Budget 2024: వ్యక్తిగత పన్ను రేటును తగ్గించాలని కేంద్రం భావిస్తోంది  బిజినెస్

    దిల్లీ

    Manish Sisodiya: దిల్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా మళ్లీ తిరిగి వస్తారా? సుప్రీంకోర్టు
    Natwar Singh : కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత కాంగ్రెస్
    Cm Revanth Reddy: 17న మళ్లీ దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం  రేవంత్ రెడ్డి
    Independence Day 2024: ఢిల్లీ నుండి శ్రీనగర్ వరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎలా జరుగుతున్నాయంటే  స్వాతంత్య్ర దినోత్సవం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025