NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌ 
    తదుపరి వార్తా కథనం
    సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌ 
    సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌

    సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 06, 2023
    10:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో తమకు అపరిమిత అవకాశాలు ఉన్నాయని ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భావిస్తోంది.

    ఈ మేరకు స్థూల ఆర్థిక వృద్ధి, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో దేశం మెరుగ్గా ఉందని భారత మెటా అధిపతి సంధ్య దేవనాథన్‌ అభిప్రాయపడ్డారు.

    మరోవైపు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి తమ యాప్స్‌ భారత్‌లో గణనీయంగా ప్రాచుర్యం పొందుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌ను కీలక మార్కెట్‌గా పరిగణిస్తున్నట్లు సంధ్య చెప్పుకొచ్చారు.

    కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన డిజిటల్‌ వ్యక్తిగత డేటా భద్రత చట్టం(DIGITAL PRIVACY DATA PROTECTION ACT)తో యూజర్ల వివరాల గోప్యతను పాటించేందుకు వీలు కలిగిందన్నారు.

    అంతేకాకుండా కొత్త ఆవిష్కరణలు చేస్తూ సమతూల్యం పాటించేందుకు టెకీలకు స్పష్టత దొరికిందని వివరించారు.

    DETAILS

    భారత్‌లో 40 కోట్ల మందిపైగా వినియోగదారులున్నారు : భారత హెడ్ సంధ్య

    మెటా, వాట్సాప్ సహా ఇన్‌స్టాగ్రామ్‌ వంటి తమ గ్రూప్ ప్లాట్‌ఫామ్‌పై తప్పుడు సమాచారం, విద్వేషపూరిత కంటెంట్‌ని నియంత్రించేందుకు కృత్రిమ మేధస్సు(ARTIFICIAL INTELLIGENCE)ను సమర్థంగా వినియోగించేందుకు కృషి చేస్తున్నట్లు భారత మెటా అధిపతి సంధ్య దేవనాథన్‌ తెలిపారు.

    మరోవైపు యూజర్ల పెరుగుదల, కీలక మార్కెట్లలో యువతలో ఫేస్‌బుక్‌కు ఆదరణ తగ్గుతోందన్న అభిప్రాయాన్ని ఆమె సున్నితంగా తోసిపుచ్చారు.

    మెటాలో భాగమైన ఫేస్‌బుక్‌కు భారత్‌లో 40 కోట్ల మందిపైగా వినియోగదారులున్నట్లు ఆమె వివరించారు.

    భారత్‌లో తాము నవకల్పనలను పరీక్షించి, ఇంటర్నేషనల్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

    2030లోగా దాదాపు లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఎకానమీగా ఎదగాలన్న భారత లక్ష్యం, డిజిటల్ వ్యాపారాలకు గణనీయమైన ఊతమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    మెటా

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    భారతదేశం

    Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం చంద్రయాన్-3
    అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు చంద్రయాన్-3
    చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షల వెల్లువ ఇస్రో
    BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ బ్రిక్స్ సమ్మిట్

    మెటా

    మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు! టెక్నాలజీ
    వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్ టెక్నాలజీ
    2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు టెక్నాలజీ
    ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్ ఫీచర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025