NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
    భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'..

    Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2025
    03:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని ప్రతి ఒక్కరి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

    ముఖ్యంగా అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులతో సహా అన్ని వర్గాల పౌరులకు ప్రయోజనం చేకూరేలా "యూనివర్సల్ పెన్షన్ స్కీమ్" తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

    ప్రస్తుతం నిర్మాణ కార్మికులు, గృహ సేవకులు, గిగ్ వర్కర్లు వంటి అసంఘటిత రంగానికి చెందిన కార్మికులకు ప్రభుత్వం అందించే పెద్ద మొత్తంలో పొదుపు పథకాలు అందుబాటులో లేవు.

    ఈ కొత్త పథకం వేతన జీవులకు మాత్రమే కాకుండా,స్వయం ఉపాధిలో ఉన్న వారికి కూడా లభ్యమవుతుంది.

    వివరాలు 

    యూనివర్సల్ పెన్షన్ స్కీమ్" తీసుకురావాలని ప్రభుత్వ ఆలోచన 

    అయితే, ఈ పథకం,ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వంటి ఇప్పటికే ఉన్న పెన్షన్ పథకాల మధ్య ప్రధాన తేడా ఏమిటంటే - ఈ పథకంలో పాల్గొనేవారు స్వచ్ఛందంగా తమ వంతు సహకారం అందించాలి, కానీ ప్రభుత్వం తరం నుంచి ఎటువంటి ఆర్థిక మద్దతు ఉండదు.

    పెన్షన్ పథకాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు"యూనివర్సల్ పెన్షన్ స్కీమ్" తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది.

    అంటే,ఇప్పటికే దేశంలో అమలులో ఉన్న వివిధ పెన్షన్ పథకాలను సమన్వయం చేయడం ద్వారా ఈ కొత్త పథకం రూపుదిద్దుకోనుంది.

    ఏ పౌరుడైనా స్వచ్ఛందంగా ఈ పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

    వివరాలు 

    అసంఘటిత కార్మికుల కోసం అనేక పెన్షన్ పథకాలు 

    ప్రస్తుతానికి "న్యూ పెన్షన్ స్కీమ్" అని పిలుస్తున్న ఈ పథకం, ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ పెన్షన్ పథకం (NPS) ను భర్తీ చేయడం లేదా విలీనం చేయడం లేదని తెలుస్తోంది.

    ప్రస్తుతం అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక పెన్షన్ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ప్రధానమైనవి:

    అటల్ పెన్షన్ యోజన (APY) - ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతినెలా రూ. 1,000 నుండి రూ. 1,500 వరకు పెన్షన్ లభిస్తుంది.

    ప్రధానమంత్రి శ్రమ యోగి మంధన్ యోజన (PM-SYM) - వీధి వ్యాపారులు, గృహ పనివారు, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే పెన్షన్ పథకం.

    వివరాలు 

    మరింత మందికి పెన్షన్ లభించేలా..

    ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన (PM-KMY) - ఇది రైతుల కోసం రూపొందించిన పథకం. ఇందులో 60 ఏళ్లు నిండిన తరువాత నెలకు రూ. 3,000 పెన్షన్ అందించబడుతుంది.

    ఈ విధంగా, కొత్తగా రాబోయే "యూనివర్సల్ పెన్షన్ స్కీమ్" ద్వారా మరింత మందికి పెన్షన్ లభించేలా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్
    Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి ఆంధ్రప్రదేశ్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్

    కేంద్ర ప్రభుత్వం

    RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం పనులకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్? నితిన్ గడ్కరీ
    Amit Shah: లొంగిపోయిన మావోయిస్టులకు ఇల్లుతో పాటు ఉపాధి అమిత్ షా
    OTT Platforms:  ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం వార్నింగ్‌.. ఆ సన్నివేశాలు ఉంటే కఠిన చర్యలు  ఓటిటి
    JPC Members: జమిలి బిల్లుపై 48 గంటల గడువు.. జేపీసీ ఏర్పాటుకు స్పీకర్ ముందడుగు జమిలి ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025