NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,100
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,100
    లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,100

    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,100

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    04:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి.

    అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభమై, రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి.

    ఇన్ఫోసిస్‌, జొమాటో, టీసీఎస్‌ వంటి కంపెనీల షేర్లలో జరిగిన కొనుగోళ్లు సూచీలకు బలాన్ని ఇచ్చాయి.

    అంతేకాకుండా, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో పన్ను మినహాయింపులపై ఆశలు పెరగడం కూడా మార్కెట్‌కు మద్దతుగా మారింది.

    మదుపర్లు కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లకు దిగడం, అలాగే ఐటీ, ఆటో రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడం వల్ల సూచీలు లాభాలను సాధించాయి.

    రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు కూడా మార్కెట్‌ ర్యాలీకి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

    వివరాలు 

    నిఫ్టీ 205 పాయింట్లు పెరిగి 23,163

    మరోవైపు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశానికి ముందు అక్కడి విధాన పరమైన నిర్ణయాల కోసం మదుపర్లు వేచి చూస్తున్నారు.

    మార్కెట్‌ లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ, విదేశీ సంస్థాగత మదుపర్లు షేర్ల విక్రయాలను కొనసాగిస్తుండడంతో కొంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

    సెన్సెక్స్‌ ఉదయం 76,138.24 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 75,901.41) లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 76,599.73 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.

    చివరికి 631 పాయింట్ల లాభంతో 76,532 వద్ద ముగిసింది. నిఫ్టీ 205 పాయింట్లు పెరిగి 23,163 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.55 వద్ద నిలిచింది.

    వివరాలు 

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 76.73 డాలర్లు 

    సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.

    అయితే, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టపోయాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 76.73 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,797.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్
    Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి ఆంధ్రప్రదేశ్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్

    స్టాక్ మార్కెట్

    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..సెన్సెక్స్‌ 720 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్ల నష్టం  బిజినెస్
    Stock Market : స్వల్ప లాభంతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 1500 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్‌  బిజినెస్
    Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹12 లక్షల కోట్లు ఆవిరి!  సెన్సెక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025