NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: నేడు నష్టాల్లోప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. 23,250 దిగువన నిఫ్టీ
    తదుపరి వార్తా కథనం
    Stock Market: నేడు నష్టాల్లోప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. 23,250 దిగువన నిఫ్టీ
    నేడు నష్టాల్లోప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. 23,250 దిగువన నిఫ్టీ

    Stock Market: నేడు నష్టాల్లోప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. 23,250 దిగువన నిఫ్టీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

    గత మూడు రోజుల నుండి లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, అంతర్జాతీయంగా వచ్చిన బలహీన సంకేతాలతో నష్టాలు ఎదుర్కొన్నాయి.

    ఇన్ఫోసిస్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి షేర్లలో మదుపర్లు కొనుగోలు చేయడంతో సూచీలు కుంగాయి.

    ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్‌ 367 పాయింట్ల నష్టంతో 76,706 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 23,220 వద్ద కదలాడుతోంది.

    సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎమ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81.57 డాలర్లు 

    ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్‌, జొమాటో, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81.57 డాలర్ల వద్ద ఉంది, బంగారం ఔన్సు ధర 2,746.80 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.56 వద్ద కొనసాగుతోంది.

    అమెరికా మార్కెట్లు, నాస్‌డాక్‌, ఎస్ అండ్ పీ 500, డౌ జోన్స్ నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈ రోజు బలహీనంగా ట్రేడవుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.4,342 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,929 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    స్టాక్ మార్కెట్

    Multibaggar stock : మీరు కొన్నారా..?.. 5ఏళ్లలో 26000శాతం పెరిగిన స్టాక్! టాటా మోటార్స్
    Stock Market: లాభాలతో మొదలైన సూచీలు.. నిఫ్టీ 23,700 బిజినెస్
    Stock market today: లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 498, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభం  బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 23,750 మార్క్‌ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025