NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550 
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550 
    లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550

    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఈ ప్రభావంతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ప్రస్తుతం స్థిరంగా (ఫ్లాట్‌గా) ట్రేడవుతున్నాయి.

    ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్‌ (Sensex) 5 పాయింట్లు పెరిగి 74,607 వద్ద, నిఫ్టీ (Nifty) 8 పాయింట్లు పెరిగి 22,555 వద్ద కొనసాగుతున్నాయి.

    సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    అల్ట్రాటెక్‌ సిమెంట్‌,పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌,ఎన్టీపీసీ,టాటా మోటార్స్‌,టెక్‌ మహీంద్రా,కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,టీసీఎస్‌,మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

    వివరాలు 

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.33 

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 72.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం ఔన్సు 2,920.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.33 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు మునుపటి ట్రేడింగ్ సెషన్‌ను స్థిరంగా (ఫ్లాట్‌గా) ముగించాయి.

    ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.22 శాతం, జపాన్‌ నిక్కీ 0.15 శాతం లాభాల్లో కొనసాగుతుండగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 0.66 శాతం, షాంఘై 0.42 శాతం నష్టాల్లో ఉన్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.3,529 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,031 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా? నిద్రలేమి
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్
    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    స్టాక్ మార్కెట్

    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 5 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల నష్టం  బిజినెస్
    Stock Market: భారీ నష్టాలతో స్టాక్‌ మార్కెట్ ప్రారంభం  బిజినెస్
    Stock market: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్  సెన్సెక్స్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,500  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025