NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,400 ఎగువన నిఫ్టీ
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,400 ఎగువన నిఫ్టీ
    లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,400 ఎగువన నిఫ్టీ

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,400 ఎగువన నిఫ్టీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 21, 2025
    09:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయ సూచీలకు మద్దతుగా నిలిచాయి.

    ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్ల కొనుగోళ్ల వల్ల మార్కెట్ సూచీలు పాజిటివ్‌గా రాణిస్తున్నాయి.

    మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో ప్రారంభమై, నిఫ్టీ 23,400 మార్క్ పైగా ఉంది.

    ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 103 పాయింట్లు లాభంతో 77,177 వద్ద ట్రేడవుతోంది.

    నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 23,412 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఐటీసీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    నేడు లాభాల్లో కొనసాగుతున్న ఆసియా-పసిఫిక్ మార్కెట్లు

    కానీ జొమాటో, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.22 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 2,743.90 వద్ద ట్రేడవుతోంది.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.28 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి.

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.4,337 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,322 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,800 మార్క్‌ పైన నిఫ్టీ  బిజినెస్
    small stocks: 2024లో స్మాల్  స్టాక్‌దే ఊపు..పెట్టుబడిదారులకు లాభాల పంట బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 78,472 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు  బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025