NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 19, 2024
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, గత కొన్ని రోజులుగా పెద్ద నష్టాలు కలిగిన మార్కెట్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

    దీంతో సూచీలు లాభాలను నమోదు చేశాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 200 పాయింట్ల పెరుగుదలతో, నిఫ్టీ 23,500 పాయింట్ల పైగా ప్రారంభమయ్యాయి.

    ఉదయం 9:30కి సెన్సెక్స్‌ 701 పాయింట్లు పెరిగి 78,040 వద్ద ట్రేడవుతోంది, నిఫ్టీ 213 పాయింట్ల పెరుగుదలతో 23,667 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    నష్టాల్లో కోటక్‌ మహీంద్రా,సన్‌ఫార్మా,బజాజ్‌ఫిన్‌సర్వ్‌

    సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్టీపీసీ, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా, ఐటీసీ వంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    కోటక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, బజాజ్‌ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73.43 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 2,628.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.40 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

    అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి,అలాగే ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు కూడా అదే దిశలో కొనసాగుతున్నాయి.

    ఆస్ట్రేలియా ASX 1.49%, జపాన్ నిక్కీ 0.55%, హాంకాంగ్ హాంగ్‌సెంగ్‌ 0.28% లాభాలతో ఉన్నాయి, కాగా షాంఘై 0.41% నష్టాల్లో కొనసాగుతోంది.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం 1,403 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించారు.

    అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) 2,331 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    స్టాక్ మార్కెట్

    Stock Market: సెన్సెక్స్-నిఫ్టీలో ఆల్ రౌండ్ సెల్లింగ్, కరెక్షన్‌లో ₹1.26 లక్షల కోట్ల నష్టం  బిజినెస్
    Stock Market: నష్టాలలోనే దేశీయ స్టాక్ మార్కెట్.. 22650 దిగువకు నిఫ్టీ  సెన్సెక్స్
    Stock Market: వారం చివరి ట్రేడింగ్ రోజున భారీ లాభాల్లో మార్కెట్లు.. 22,600 పైన నిఫ్టీ.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌  బిజినెస్
    Stock Market: ఎగ్జిట్ పోల్ అంచనాల తర్వాత భారీగా ఊపందుకున్న మార్కెట్  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025