LOADING...
NSDL IPO: ఎట్టకేలకు తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దిగిన NSDL..జూలై 30 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం 
జూలై 30 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

NSDL IPO: ఎట్టకేలకు తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దిగిన NSDL..జూలై 30 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రముఖ డిపాజిటరీ సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) చివరికి తన తొలి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. భారత మార్కెట్‌లో ఫైనాన్షియల్ మరియు సెక్యూరిటీ సేవలను అందిస్తున్న ఈ సంస్థ జూలై 30న తమ ఐపీఓను ప్రారంభించనుంది. ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.4,000 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ముందుకొస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌కు చివరి తేదీ ఆగస్టు 1 కాగా, యాంకర్ ఇన్వెస్టర్లు తమ బిడ్లు జూలై 29 నుంచే వేయగలుగుతారు. అయితే, షేర్ ధరల శ్రేణి ఇంకా వెల్లడించలేదు.ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలోనే జరగనుంది.

వివరాలు 

ఈ ఆఫర్‌లో మొత్తం 5.01 కోట్ల షేర్ల విక్రయం 

దీనివల్ల కంపెనీకి నేరుగా ఎలాంటి పెట్టుబడి రావడం లేదు. ఈ సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (UTI) వంటి సంస్థలు తమ వాటాల్ని తగ్గించనున్నాయి. మొత్తం 5.01 కోట్ల షేర్లు ఈ ఆఫర్‌లో విక్రయించబోతున్నారు. దీని వలన NSDLకు ఎటువంటి నిధుల ప్రవాహం జరగదు. దేశంలో అతిపెద్ద డిపాజిటరీగా ఉన్న NSDL, ఇప్పటికే గత సంవత్సరం అక్టోబరులో సెబీ నుండి అనుమతిని పొందింది. ఇదివరకు మరో డిపాజిటరీ సంస్థ అయిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (CDSL) 2017లో NSEలో లిస్టయ్యింది.

వివరాలు 

ఏ ఒక్క సంస్థకూ 15 శాతానికి మించి వాటాలు ఉండకూడదు

ఇప్పుడు NSDL రెండవ డిపాజిటరీగా లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. సెబీ విధించిన నిబంధనల ప్రకారం, ఏ ఒక్క సంస్థకూ 15 శాతానికి మించి వాటాలు కలిగి ఉండకూడదు. అందువల్ల, ప్రస్తుత షేర్‌హోల్డర్లుగా ఉన్న సంస్థలు తమ వాటాలను తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం IDBIకి 26.10 శాతం వాటా ఉండగా, NSEకి 24 శాతం వాటా ఉంది. ఈ ఐపీఓ నిర్వహణకు సంబంధించి బుక్ రన్నింగ్ మేనేజర్లుగా పనిచేస్తున్న సంస్థలలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్, ఐడీబీఐ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి.

వివరాలు 

ఐపీఓపై ప్రజల్లో ఆసక్తి

2024-25 ఆర్థిక సంవత్సరానికి NSDL నికర లాభం రూ.343 కోట్లు కాగా, మొత్తం ఆదాయం రూ.1,535 కోట్లు గా నమోదైంది. ఇది మదుపర్లలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ ఐపీఓపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నది. దీనికితోడు గూగుల్ ట్రెండ్స్‌లో కూడా NSDL IPO గురించి శోధనలు పెరిగాయి, అంటే నెటిజన్లలో గణనీయమైన చర్చ సాగుతోంది.