NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Madhabi puri Buch: సెబీ చీఫ్‌కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్‌ సమన్లు..?
    తదుపరి వార్తా కథనం
    Madhabi puri Buch: సెబీ చీఫ్‌కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్‌ సమన్లు..?
    సెబీ చీఫ్‌కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్‌ సమన్లు..?

    Madhabi puri Buch: సెబీ చీఫ్‌కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్‌ సమన్లు..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    12:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ (SEBI) ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్‌ ప్రస్తుతం కొత్త సమస్యల్లో చిక్కుకున్నారు.

    ఆమె అధిపతిగా ఉన్నప్పటి నుండి, సెబీ కార్యాలయంలో పని విధానంపై సిబ్బంది చేసిన ఫిర్యాదులు ఒక పెద్ద వివాదానికి దారితీశాయి.

    ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    ముఖ్యంగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌ నేతృత్వంలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆమెకు సమన్లు జారీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని వార్తలు అందుతున్నాయి.

    వివరాలు 

    ఉద్యోగులు రాసిన లేఖ పలు అంశాలు

    సెబీ బాస్ చుట్టూ గతంలో అనేక వివాదాలు చుట్టుకున్నాయి. ముఖ్యంగా,అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న ఆరోపణల తరువాత, ఐసీఐసీఐ బ్యాంక్ నుండి వేతనం పొందడం వంటి అంశాలపై ఆమె మరింత చర్చకు వచ్చిన విషయం తెలిసిందే.

    ఇటీవల,సెబీలో పనితీరుపై ఉద్యోగులు రాసిన లేఖ పలు అంశాలను వెలుగులోకి తెచ్చింది.లేఖలో, మాధవి సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత,సంస్థ పని విధానం పూర్తిగా మారిపోయిందని,భారీ లక్ష్యాలు నిర్ణయించడం,సాధించలేకపోతే అవమానించడం సాధారణంగా మారిపోయిందని పేర్కొన్నారు.

    దీనిపై సెబీ 'బయటి వ్యక్తుల పనే' అని వివరణ ఇచ్చింది.దీనితో వివాదం మరింత తీవ్రతరం అయింది.

    దీనికి సంబంధించి,సెబీ ప్రధాన కార్యాలయం వద్ద సెబీ ఉద్యోగులు గురువారం నిరసన తెలిపారు. మాధవి పురి బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

    వివరాలు 

    సెప్టెంబర్ 10న పీఏసీ సమావేశం

    ప్రభుత్వ ఖాతాలు, ప్రభుత్వ సంస్థల పనితీరుపై నిఘా ఉంచడం పబ్లిక్ అకౌంట్ కమిటీ (PAC) బాధ్యత.

    సెప్టెంబర్ 10న పీఏసీ తదుపరి సమావేశం జరగనుంది, అదే రోజున సెబీ ఛైర్‌పర్సన్‌ను పిలిచే అవకాశం ఉంది.

    అలాగే, జల్ శక్తి మంత్రిత్వ శాఖ కాగ్ (CAG) రిపోర్ట్‌పై కూడా చర్చలు జరగనున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025