
Rafale: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు.. టాటా, డసో మధ్య ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది.
భారత వైమానిక దళంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రఫేల్ యుద్ధవిమానాల తయారీకి సంబంధించిన అంశంలో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరింది.
ఫ్రాన్స్కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ,భారతదేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందం ప్రకారం రఫేల్ యుద్ధవిమానాల్లో ఉపయోగించే ముఖ్యమైన భాగాలను హైదరాబాద్లో తయారు చేయనున్నారు.
ఇది ఫ్రాన్స్ వెలుపల రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ భాగాలు ఉత్పత్తి చేయబోయే మొట్టమొదటి సారి కావడం విశేషం.
ఈ ఒప్పందం ద్వారా భారతదేశం ఏరోస్పేస్ రంగంలో వేగంగా పురోగమిస్తున్నదనే విషయానికి స్పష్టమైన ఉదాహరణ లభించిందని చెప్పవచ్చు.
వివరాలు
2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యం
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో సన్నాహాలు చేస్తోంది.
డసో ఏవియేషన్ చైర్మన్ అండ్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ, ''భారతదేశంలో మా తయారీ స్థాపనను బలోపేతం చేయడం ఈ ఒప్పందంతో సాధ్యమవుతోంది. భారత రక్షణ రంగంలో మా పాత్రను విస్తరించుకునే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఈ నిర్ణయం రఫేల్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తుంది. అందించబోయే నాణ్యమైన సేవలు భారత సైనిక అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉపయోగపడతాయి'' అని తెలిపారు.
వివరాలు
భారత వైమానిక రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు
ఇదే విషయంపై టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఎండీ సుకరన్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత రక్షణ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
డసో ఏవియేషన్తో కుదిరిన ఈ ఒప్పందం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ నైపుణ్యాలను, సామర్థ్యాలను ప్రపంచానికి చూపించడమే కాకుండా, భారత వైమానిక రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు.