NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market today: మదుపర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన సూచీలు
    తదుపరి వార్తా కథనం
    Stock market today: మదుపర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన సూచీలు
    మదుపర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన సూచీలు

    Stock market today: మదుపర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన సూచీలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 07, 2025
    04:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మన మార్కెట్లను ఓ మోస్తరుగా రాణింపజేశాయి.

    నిన్నటి భారీ నష్టాల తర్వాత మదుపర్లకు కొంత ఊరట లభించింది.

    ముఖ్యంగా వైరస్‌కు సంబంధించి ఆందోళన అవసరం లేదన్న వార్తలు మార్కెట్‌కు మద్దతు అందించాయి. సెన్సెక్స్‌ ఉదయం స్వల్ప లాభాల్లో 78,019.80 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

    రోజంతా మోస్తరు లాభాలతో కొనసాగిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 78,452.74 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి, చివరికి 234.12 పాయింట్ల లాభంతో 78,199.11 వద్ద ముగిసింది.

    Details

    నష్టాల్లో టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌

    నిఫ్టీ కూడా 91.85 పాయింట్లు లాభపడి 23,707 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు తగ్గి 85.73గా నమోదైంది.

    సెన్సెక్స్‌ 30లో టాటా మోటార్స్‌, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా, జొమాటో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టపోయాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 76 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 2653 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    సెన్సెక్స్

    తాజా

    GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం ముంబయి ఇండియన్స్
    Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు! తెలంగాణ
    Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్? కాంగ్రెస్
    Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌

    స్టాక్ మార్కెట్

    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. న్సెక్స్‌ 16 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభాలు  బిజినెస్
    Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,500 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ  బిజినెస్
    Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. మైనస్‌ 1129 టు ప్లస్‌ 843  బిజినెస్

    సెన్సెక్స్

    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్
    భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్
    నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత  స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025