NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market update:భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌.. తుడిచిపెట్టుకుపోయిన రూ.7లక్షల కోట్లు.. క్రాష్ వెనుక 4 కీలక అంశాలు ఇవే
    తదుపరి వార్తా కథనం
    Stock market update:భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌.. తుడిచిపెట్టుకుపోయిన రూ.7లక్షల కోట్లు.. క్రాష్ వెనుక 4 కీలక అంశాలు ఇవే
    భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌

    Stock market update:భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌.. తుడిచిపెట్టుకుపోయిన రూ.7లక్షల కోట్లు.. క్రాష్ వెనుక 4 కీలక అంశాలు ఇవే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 03, 2024
    01:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి.

    మధ్యాహ్నం 12:30 గంటలకు సెన్సెక్స్ 1,379 పాయింట్ల నష్టంతో 82,886 వద్ద కొనసాగుతున్నది.అలాగే నిఫ్టీ 420 పాయింట్ల నష్టంతో 25,376 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

    సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్,సన్‌ఫార్మా షేర్ల మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎల్‌ అండ్‌ టీ,బజాజ్ ఫిన్‌సర్వ్,రిలయన్స్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

    బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ. 7 లక్షల కోట్లు ఆవిరయింది,ఇది మదుపర్ల సంపదను గణనీయంగా ప్రభావితం చేస్తోంది.

    వివరాలు 

    కారణాలు ఇవే..

    పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపర్లలో ఆందోళనను కలిగిస్తున్నాయి.

    పశ్చిమాసియాలోని భయాల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. 70-71 డాలర్ల వద్ద కొనసాగిన బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌కు సంబంధించి సెబీ ఇటీవల కఠినతరం చేసిన నియమాలు కూడా మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి.

    చైనా ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో ఆ దేశ స్టాక్స్ బాగా ప్రదర్శిస్తున్నాయి, ఇది భారతదేశానికి చెందిన పెట్టుబడులను తరలిపోతున్నందున మదుపర్లలో ఆందోళనను పెంచుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    స్టాక్ మార్కెట్

    ఇండియన్ మార్కెట్లలోకి డబ్బే డబ్బు.. భారత బాండ్లలోకి త్వరలోనే 25 బిలియన్ డాలర్లు   షేర్ విలువ
    భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ అదానీ గ్రూప్
    Mamaearth IPO: మామాఎర్త్ ఐపీఓ.. తొలిరోజు 12శాతం మంది సబ్‌స్క్రైబ్  తాజా వార్తలు
    భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్‌ అయ్యేందుకు కేంద్రం అనుమతి  కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025