Page Loader
Stock Market : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 
లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆటో షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచడంతో, మార్కెట్ తొలుత నష్టాల్లో ప్రారంభమైంది. అయితే, ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కొద్ది సేపటికే లాభదాయక మార్గంలో సాగింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 246 పాయింట్ల లాభంతో 77,537 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ (Nifty) 59 పాయింట్ల లాభంతో 23,546 వద్ద కొనసాగింది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 73.85 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, ఐటీసీ, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతుండగా, జొమాటో, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్టీపీసీ, టైటాన్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 73.85 డాలర్ల వద్ద ఉంది. బంగారం ఔన్సు 3,036 డాలర్ల మార్క్‌ను దాటి ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.90 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

టారిఫ్‌ భయాలతో నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

అమెరికా మార్కెట్లు బుధవారం టారిఫ్‌ భయాలతో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 1.12 శాతం, నాస్‌డాక్‌ 2.04 శాతం నష్టపోగా, డౌజోన్స్‌ స్థిరంగా ముగిసింది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ర్టేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.55 శాతం, జపాన్‌ నిక్కీ 0.93 శాతం నష్టపోగా, హాంకాంగ్‌ హాంగ్‌ సెంగ్‌ 0.81 శాతం, షాంఘై 0.31 శాతం లాభంలో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం రూ.2,241 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.696 కోట్ల షేర్లు విక్రయించారు.