NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750
    లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2025
    10:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

    ముఖ్య స్టాక్స్‌లో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపించడంతో షేర్లు పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ షేర్లలో కొనుగోళ్లు చోటుచేసుకోవడంతో సూచీలు రాణిస్తున్నాయి .

    నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 150 పాయింట్లు పెరిగి, నిఫ్టీ 23,750 పైన ప్రారంభమైంది.

    ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్‌ 151 పాయింట్లు పెరిగి 78,656 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 23,786 వద్ద ట్రేడవుతోంది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, జొమాటో, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    వివరాలు 

    డాలర్‌  85.73వద్ద కొనసాగుతోంది

    కానీ ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.69 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 2,645 రూపాయల వద్ద ఉంది.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.73 వద్ద కొనసాగుతోంది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

    జపాన్‌ నిక్కీ, షాంఘై, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ స్థిరంగా ఉంది.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా 1,783 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) 1,690 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా

    స్టాక్ మార్కెట్

    Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. త్వరలో వెలువడనున్న ఆర్బీఐ కొత్త పాలసీ బిజినెస్
    Stock Market: ఆర్‌బీఐ ప్రకటనకు ముందు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల వరుస లాభాలకు బ్రేక్‌.. సెన్సెక్స్‌ 56 పాయింట్లు,నిఫ్టీ 35 పాయింట్ల చొప్పున నష్టం  బిజినెస్
    Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025