NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌
    రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌

    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 06, 2025
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం లాభాల దిశగా ప్రయాణిస్తున్నాయి.

    విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ బి ఐ) కీలక వడ్డీ రేట్లను వరుసగా మూడోసారి తగ్గించడంతో మార్కెట్లకు ఊతమిచ్చింది.

    తాజా ప్రకటనలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించినట్టు తెలియజేయడంతో, సూచీలు పరుగులు తీస్తున్నాయి.

    ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల షేర్లు మంచి లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ కొత్త గరిష్ఠస్థాయిని చేరుకుంది.

    వివరాలు 

    నిఫ్టీ@ 24,975

    ఉదయం 11:12 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 701 పాయింట్ల లాభంతో 82,143 స్థాయిలో కొనసాగుతుండగా, నిఫ్టీ 224 పాయింట్లు పెరిగి 24,975 వద్ద ట్రేడవుతోంది.

    సెన్సెక్స్‌కు చెందిన 30 ప్రధాన షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఎటర్నల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    మరోవైపు, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌ మాత్రం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

    వివరాలు 

    తగనున్న గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ భారం

    తాజా నిర్ణయం ప్రకారం, రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి తగ్గించారు.

    ఇప్పటికే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో కూడా ఆర్‌బీఐ 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.

    ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రెపో రేటులో ఒక శాతం తగ్గింపునకు కేంద్ర బ్యాంక్‌ వెళ్లింది.

    వడ్డీరేటు తగ్గడంతో గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ భారం మరింత తగ్గనుంది.

    దీని ప్రభావంగా రియల్‌ ఎస్టేట్‌ రంగ షేర్లు వేగంగా పుంజుకుంటున్నాయి. అంతేకాకుండా, ఈ తగ్గింపుతో మార్కెట్లో నాణేల ప్రవాహం పెరిగే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్
    Single Movie OTT Release: ఓటీటీలోకి వచ్చిన 'సింగిల్‌'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? అమెజాన్ ప్రైమ్
    Khammam: పాఠశాల మూతపడకుండా కాపాడిన బాలిక.. నేడు అదే పాఠశాలకు ప్రచారకర్త ఖమ్మం
    Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతీనెలా రెండుసార్లు.. తెలంగాణ

    స్టాక్ మార్కెట్

    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు డౌన్‌  బిజినెస్
    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం  బిజినెస్
    Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..  బిజినెస్
    Stock market: మోస్తరు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 182, నిఫ్టీ 88 పాయింట్లు చొప్పున లాభం  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025