NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600
    లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

    భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సూచీలు బలంగా నిలుస్తున్నాయి.

    ఉదయం 9:27 గంటలకు సెన్సెక్స్ 201 పాయింట్ల లాభంతో 80,938 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 24,601 వద్ద ఉంది.

    సెన్సెక్స్ 30 సూచీగా భారతీ ఎయిర్‌టెల్, ఎటర్నల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఎంఅండ్ ఎం, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    కాగా,టీసీఎస్,అల్ట్రాటెక్ సిమెంట్,టైటాన్,ఐసీఐసీఐ బ్యాంక్,సన్‌ఫార్మా,యాక్సిస్ బ్యాంక్,ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

    రూపాయి-డాలర్ మారకం విలువ 85.80 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 65.42 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 3,390 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్ 0.81%, ఎస్ అండ్ పీ 500 0.58%, డోజోన్స్ 0.51% లాభాలను నమోదు చేశాయి.

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు కూడా అదే ధోరణిలో పయనిస్తున్నాయి. జపాన్ నిక్కీ 1.04%, ఆస్ట్రేలియన్ ఏఎస్‌ఎక్స్ 0.87%,హాంగ్‌సెంగ్ 0.69%,షాంఘై 0.38% లాభాలతో ట్రేడవుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు మూడో రోజు వరుసగా విక్రేతలుగా నిలిచారు.

    మంగళవారం వారు నికరంగా రూ.2,854 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా,దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.5,908కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    స్టాక్ మార్కెట్

    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు వ్యాపారం
    Defense stock: ఉద్రిక్తతల వేళ.. డిఫెన్స్‌ స్టాక్స్‌ పరుగులు.. 18 శాతం పెరిగిన ఐడియాఫోర్జ్ టెక్   బిజినెస్
    Share Market: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్లు  బిజినెస్
    Stock market: ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్‌ 880 పాయింట్లు పతనం! వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025