NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 80వేల పైకి సెన్సెక్స్‌ 
    తదుపరి వార్తా కథనం
    Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 80వేల పైకి సెన్సెక్స్‌ 
    భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 80వేల పైకి సెన్సెక్స్‌

    Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 80వేల పైకి సెన్సెక్స్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 25, 2024
    04:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, అలాగే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయవంతమైన కారణంగా సూచీలు వరుసగా రెండో రోజు కూడా మంచి ప్రదర్శన చేశాయి.

    ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజ షేర్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి.

    ఫలితంగా సెన్సెక్స్‌ 80,000 పాయింట్లను మళ్లీ దాటగా, నిఫ్టీ 24,200 పాయింట్లకు పైగా నిలిచింది.

    వివరాలు 

    మార్కెట్‌ గమనిక

    సెన్సెక్స్‌ ఉదయం 80,193.47 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై (మునుపటి ముగింపు 79,117.11), ఇన్రాడేలో 1,300 పాయింట్లకు పైగా పెరిగి 80,473.08 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

    చివరికి 992.74 పాయింట్ల లాభంతో 80,109.85 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 314.65 పాయింట్ల లాభంతో 24,221.90 వద్ద స్థిరపడింది.

    రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే కొంత బలపడి 84.30కి చేరింది.

    వివరాలు 

    లాభాలు, నష్టాలు

    సెన్సెక్స్‌ 30 సూచీల్లో ఎల్‌అండ్‌టీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

    అయితే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు కొంత నష్టపోయాయి.

    అంతర్జాతీయ మార్కెట్లు:

    బ్రెంట్ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 74 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 2672 డాలర్ల వద్ద ఉంది.

    వివరాలు 

    జొమాటో షేరు ప్రదర్శన: 

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలో జొమాటోను చేర్చుతున్నట్లు ప్రకటించడంతో ఆ కంపెనీ షేరు మంచి లాభాలు సాధించింది.

    ఇంట్రాడేలో 7 శాతం వరకు లాభపడిన జొమాటో షేరు చివరికి 3.29 శాతం లాభంతో ₹272.90 వద్ద స్థిరపడింది.

    జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు మాత్రం 2.40 శాతం క్షీణించి ₹953.35 వద్ద ముగిసింది.

    ఈ రోజున మార్కెట్‌ ప్రధానంగా స్థిరమైన పెరుగుదలని చూపించగా, భవిష్యత్‌ గమనానికి ఇవి ప్రోత్సాహకర సంకేతాలు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు; సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 22750  సెన్సెక్స్
    Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920  బిజినెస్
    Stock Market : లాభాల బాటలో స్టాక్ మార్కెట్.. 77000 దాటిన సెన్సెక్స్ ,23400 దాటిన నిఫ్టీ  బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@ 23250  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025