Page Loader
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 29 పాయింట్లు, నిఫ్టీ 14 పాయింట్ల నష్టం 
ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 29 పాయింట్లు, నిఫ్టీ 14 పాయింట్ల నష్టం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చిన నేపథ్యంలో, సూచీలు ఉదయం స్థిరంగా ప్రారంభమై, కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. రోజంతా తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ, చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 76,073.71 వద్ద (గత ముగింపు 75,996.86) స్థిరంగా ప్రారంభమైంది. మార్కెట్‌ జరిపిన వ్యాపారంలో ఇది 75,531.01 కనిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 20 పాయింట్లు తగ్గి 75,967 వద్ద ముగిసింది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 22,945 వద్ద స్థిరపడింది. రూపాయి-డాలర్‌ మారకం విలువ 86.96 వద్ద స్థిరంగా ఉంది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.84 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, టీసీఎస్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, జొమాటో, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.84 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2,925.20 డాలర్ల వద్ద కొనసాగుతోంది.