NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ 23,912 
    తదుపరి వార్తా కథనం
    Stock Market : ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ 23,912 
    ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ 23,912

    Stock Market : ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ 23,912 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2024
    09:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ప్రారంభంలో ఫ్లాట్‌గా కనిపిస్తున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిక్స్డ్ సంకేతాలు రావడం వల్ల మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో సూచీలు పెద్దగా మార్పులు లేకుండా ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 169 పాయింట్లు తగ్గి 79,049 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 42 పాయింట్లు తగ్గి 23,908 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్ 30 సూచీలో కొన్ని కంపెనీలు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. అవి యాక్సిస్ బ్యాంక్,ఐటీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్,టెక్ మహీంద్రా,సన్‌ఫార్మా షేర్లు.

    మరోవైపు టీసీఎస్,ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్,టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి.

    వివరాలు 

    అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.46 డాలర్ల వద్ద కొనసాగుతూ, బంగారం ఔన్సు 2,613.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.07 వద్ద ఉంది.

    అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి, అలాగే ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి.

    ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 1.20 శాతం నష్టంతో ట్రేడవుతుండగా, జపాన్ నిక్కీ 0.28 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.36 శాతం, షాంఘై 0.54 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.4,225 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,943 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం టెక్నాలజీ
    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్

    స్టాక్ మార్కెట్

    Stock Market: భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్‌.. 1,961 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్  బిజినెస్
    stock market : భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 80వేల పైకి సెన్సెక్స్‌  బిజినెస్
    Stock Market: లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025