NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900
    ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900

    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2025
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణులు నెలకొన్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు, దీని ప్రభావంతో సూచీలు మార్మోగుతూ సాగుతున్నాయి.

    ప్రస్తుతం మార్కెట్ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్‌ 55 పాయింట్లు తగ్గి 75,668 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు క్షీణించి 22,903 వద్ద కొనసాగుతున్నాయి.

    సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్,ఇన్ఫోసిస్,అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా,మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, టాటా స్టీల్, జొమాటో, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ,టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.

    వివరాలు 

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.50

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.50 వద్ద కొనసాగుతోంది.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 76.40 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,943.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిసాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతుండగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 2.89%, జపాన్‌ నిక్కీ 0.11%, షాంఘై 0.74% లాభపడ్డాయి.

    అయితే ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.3,312 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,908 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా? నిద్రలేమి
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్
    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    స్టాక్ మార్కెట్

    ITC Hotels: రూ.180 వద్ద అరంగేట్రం చేసిన ITC హోటల్స్.. 11% ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చిన డెంటా వాటర్‌ బిజినెస్
    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,100 బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@23,200 బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025